తెలంగాణ

telangana

By

Published : Sep 16, 2019, 6:07 AM IST

Updated : Sep 30, 2019, 6:53 PM IST

ETV Bharat / sitara

'మాస్ సినిమా రుచి ఏంటో వాల్మీకితో తెలిసింది'

వాల్మీకి చిత్ర ప్రీ రిలీజ్ వేడుక ఆదివారం హైదరాబాద్​లో జరిగింది. వెంకటేశ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యాడు. హరీశ్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పూజాహెగ్డే కథానాయిక. ఈ నెల 20న విడుదల కానుందీ చిత్రం.

వాల్మీకి

మెగా ప్రిన్స్ వరుణ్​తేజ్ హీరోగా నటించిన చిత్రం వాల్మీకి. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో తమిళ నటుడు అధర్వ కీలక పాత్రలో కనిపించనున్నాడు. హరీశ్ శంకర్ దర్శకుడు. ఈ నెల 20న విడుదల కానున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక ఆదివారం హైదరాబాద్​లో జరిగింది. ముఖ్య అతిథిగా విక్టరీ వెంకటేశ్ హాజరయ్యాడు.

"ఎఫ్​2 తర్వాత వరుణ్ ఈ సినిమాలో లుక్ మొత్తం మార్చేశాడు. గద్దలకొండ గణేశ్​గా రచ్చ రచ్చ చేశాడు. వాల్మీకి రామాయణం రాశాడు. మరి ఈ వాల్మీకి ఏం రాశాడో సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. నా మిత్రుడు పవన్​కల్యాణ్​కు గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బ్లాస్టర్ హిట్ ఇచ్చాడు హరీశ్ శంకర్. వరుణ్​కు కూడా మంచి హిట్ ఇస్తాడని నమ్మకం ఉంది" -వెంకటేశ్​

మాస్ సినిమాలో ఉన్న కిక్కే వేరు అంటూ పవన్ కల్యాణ్ డైలాగ్ చెప్పాడు వరుణ్ తేజ్.

"ఇప్పటి వరకూ ప్రయోగాలంటూ రకరకాల సినిమాలు చేశా. కానీ మాస్ సినిమా చేస్తే ఆ కిక్కే వేరప్పా.. 'మేం మాస్ ఎందుకు చేస్తామో నీకు అర్థం కావడం లేదు' అని చిరంజీవి గారు చెప్పేవారు. ఈ సినిమాతో ఆ రుచేంటో తెలిసింది. గబ్బర్ సింగ్ చూసినప్పుడు ఇది కదా సినిమా అంటే అనిపించింది. బాబాయ్​కు అంత పెద్ద హిట్ ఇచ్చిన హరీశ్​ నాతో సినిమా చేయడం నా అదృష్టం" -వరుణ్​ తేజ్​.

ఈ కార్యక్రమంలో అధర్వ, మృణాళిని, డింపుల్ తదితరులు పాల్గొన్నారు. రామ్ ఆచంట, గోపీఆచంట నిర్మిస్తున్న ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతం సమకూర్చాడు.

ఇదీ చదవండి: 'హాట్‌' అని పిలిస్తే సంతోషిస్తా: రాశీ ఖన్నా

Last Updated : Sep 30, 2019, 6:53 PM IST

ABOUT THE AUTHOR

...view details