తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఉరీ 2.0: థియేటర్లపై మరోసారి మెరుపు దాడి - ఉరి- ది సర్జికల్ స్ట్రైక్

కార్గిల్ దివస్ సందర్భంగా జులై 26న మహారాష్ట్రలో 'ఉరీ' సినిమాను మరోసారి ప్రదర్శించనున్నారు. సుమారు 500 థియేటర్లను కేటాయించారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్​.

'ఉరి' సినిమా

By

Published : Jul 24, 2019, 2:25 PM IST

భారత సైనిక దళం 2016 లో జరిపిన మెరుపు దాడుల నేపథ్యంతో తెరకెక్కిన చిత్రం 'ఉరీ- ద సర్జికల్ స్ట్రైక్'. విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు సొంతం చేసుకుంది. ఈ ఏడాది కార్గిల్ దివస్ సందర్భంగా మహారాష్ట్రవ్యాప్తంగా 500 థియేటర్లలో మరోసారి విడుదల చేయనున్నారు.

"కార్గిల్ దివస్​లో 'ఉరీ' భాగమైనందుకు నాకు ఆనందంగా ఉంది. భారతీయులందరిలోనూ ఈ చిత్రం స్ఫూర్తి కలిగిస్తుందని అనుకుంటున్నాను. మమ్మల్ని ప్రశంసిస్తూ చాలా సందేశాలు వచ్చాయి. చిత్రం చూసి సైనిక దళాల్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నామని ఎందరో యువకులు మాకు ఈమెయిల్స్, మెసేజ్​ల రూపంలో తెలిపారు." -ఆదిత్య, దర్శకుడు

'ఉరీ' చిత్రం 2019 జనవరి 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటివరకు సుమారు రూ. 342 కోట్లు వసూలుచేసింది. ఇదే చిత్రబృందం 'అశ్వత్థామ' పేరుతో ప్రస్తుతం ఓ సినిమా రూపొందిస్తోంది.

ఇది సంగతి: రజనీ 'దర్బార్' పిక్ లీక్.. అభిమానులు ఫిదా

ABOUT THE AUTHOR

...view details