తెలంగాణ

telangana

By

Published : Jul 25, 2020, 6:31 AM IST

ETV Bharat / sitara

మొక్కలు నాటిన 'ఉప్పెన' జోడీ

గ్రీన్​ ఇండియా ఛాలెంజ్​లో పాల్గొన్న 'ఉప్పెన' బృందం.. మొక్కలు నాటి తమ బాధ్యత నిర్వర్తించారు. ఇందులో హీరోహీరోయిన్​తో పాటు దర్శకుడు పాల్గొన్నారు.

మొక్కలు నాటిన 'ఉప్పెన' జోడీ
వైష్ణవ్​తేజ్ కృతిశెట్టి

'ఉప్పెన' చిత్రబృందం శుక్రవారం మొక్కల పండగలో పాల్గొంది. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మాతల్లో ఒకరైన రవిశంకర్‌ విసిరిన గ్రీన్‌ ఛాలెంజ్‌ను కథానాయకుడు వైష్ణవ్‌ తేజ్‌, కథానాయిక కృతిశెట్టి, దర్శకుడు బుచ్చిబాబు స్వీకరించారు. వైష్ణవ్‌ తేజ్‌ జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో, కథానాయిక కృతిశెట్టి ముంబయిలోని తన ఇంటి ఆవరణలో మొక్కలు నాటారు. దర్శకుడు బుచ్చిబాబు కాకినాడలోని తన నివాసంలో ఈ హరిత కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. 'ఉప్పెన' చిత్రాన్ని ఏప్రిల్‌లో విడుదల చేయాలని చిత్రబృందం భావించినప్పటికీ లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడింది.

ఉప్పెన హీరోయిన్​ కృతిశెట్టి

ABOUT THE AUTHOR

...view details