తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మెగా కోడలుకు అరుదైన పురస్కారం

రాం​చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల ప్రతిష్ఠాత్మక అవార్డు దక్కించుకుంది. 2018కి గానూ దాదాసాహెబ్​ ఫాల్కే- ఫిలాంత్రోఫిస్ట్ ఆఫ్ ద ఇయర్​గా నిలిచింది. ఫేస్​బుక్ వేదికగా ఆమెకు శుభాకాంక్షలు తెలిపి సంతోషాన్ని పంచుకున్నాడు చెర్రీ.

By

Published : Apr 21, 2019, 8:35 AM IST

Updated : Apr 21, 2019, 11:24 AM IST

మెగా కోడలుకు అరుదైన పురస్కారం

హీరో రాంచరణ్ సతీమణి ఉపానసకు అరుదైన పురస్కారం లభించింది. దాదా సాహెబ్ ఫాల్కే- ఫిలాంత్రోఫిస్ట్ ఆఫ్ ద ఇయర్ అవార్డును దక్కించుకుంది. ఈ విషయాన్ని ట్విట్టర్​లో పంచుకుంది మెగా కోడలు. 'నిన్ను చూసి గర్వపడుతున్నా ఉప్సీ అంటూ...' భర్త రాంచరణ్ ఆమెను ప్రశంసించాడు.

ఫేస్​బుక్ వేదికగా శుభాకాంక్షలు తెలిపిన రాంచరణ్
ట్వీట్ చేసిన ఉపాసన కొణిదెల

‘‘ఈ అవార్డును చాలా గౌరవంగా స్వీకరిస్తున్నాను. అలాగే నా చుట్టూ ఉండి, ప్రతిరోజూ నాలో స్ఫూర్తి నింపుతూ ముందుకు నడిపిస్తున్న వారందరికీ దీన్ని అంకితం ఇస్తున్నాను. నా వెన్నంటే ఉండి, ఎంతగానో ప్రోత్సహిస్తున్న నా కుటుంబ సభ్యులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను..’’ -ట్విట్టర్​లో ఉపాసన కొణిదెల

ఇది చదవండి: ఆ డైరక్టర్​తో రాంచరణ్ మరో సినిమా..!

Last Updated : Apr 21, 2019, 11:24 AM IST

ABOUT THE AUTHOR

...view details