ఇటీవలే కేదార్నాథ్ను సందర్శించిన ప్రధాని నరేంద్ర మోదీ.. యోగ ముద్రలో ధ్యానం చేశారు. ఈ ఫొటోలు విడుదల చేయగానే నెటిజన్లు విపరీతంగా స్పందించారు. నెట్టింట్లో ఈ ఫొటోపై మీమ్లు ఎక్కువగా దర్శనమిచ్చాయి. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ సతీమణి ట్వింకిల్ ఖన్నా.. మోదీని ఉద్దేశిస్తూ వ్యంగ్యంగా ఓ ఫొటోను ట్విట్టర్లో పోస్టు చేసింది.
"అంతర్జాలంలో ఈ మధ్య ఆధ్యాత్మికతకు సంబంధించిన ఫొటోలు ఎక్కువగా దర్శనమిస్తున్నాయి. అందులో భాగంగానే ఈ మెడిటేషన్ ఫొటోగ్రఫి.. ఫోజులు, యాంగిల్స్ ప్రయత్నిస్తున్నాను. ఈ ఫోటో సెషన్ వెడ్డింగ్ ఫోటోగ్రఫి కంటే బాగుంది." -ట్విట్టర్లో ట్వింకిల్ ఖన్నా