కరోనా సెకండ్ వేవ్ కారణంగా తెలుగు సినిమా, సీరియల్ షూటింగ్లు చాలావరకు నిలిచిపోయాయి. ఇటీవల లాక్డౌన్లో సడలింపులు ఇచ్చిన నేపథ్యంలో, త్వరలో వీటిని తిరిగి ప్రారంభించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే సీరియళ్ల చిత్రీకరణలు తొలుత మొదలుకానున్నాయని సమాచారం.
TOLLYWOOD: 'ఆర్ఆర్ఆర్', 'ఆచార్య' సినిమాలే ముందు! - movie news
తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకూ తగ్గుతున్న నేపథ్యంలో త్వరలో షూటింగ్లు తిరిగి ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. భారీబడ్జెట్ చిత్రాలైన 'ఆర్ఆర్ఆర్', 'ఆచార్య' చిత్రీకరణలను తొలుత మొదలుపెట్టనున్నట్లు తెలుస్తోంది.
![TOLLYWOOD: 'ఆర్ఆర్ఆర్', 'ఆచార్య' సినిమాలే ముందు! Tollywood producers start planning for re-start of shoots](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11994693-909-11994693-1622654029262.jpg)
చిరంజీవి రామ్ చరణ్
ఆ తర్వాత భారీ బడ్జెట్ చిత్రాలు 'ఆర్ఆర్ఆర్', 'ఆచార్య' షూటింగ్లు ముందు మొదలు కానున్నాయని తెలుస్తోంది. అనంతరం జులై చివరికల్లా చిత్రీకరణలు పూర్తిస్థాయిలో జరపాలని నిర్మాతలు భావిస్తున్నారు. మరోవైపు థియేటర్లు తెరుచుకునేందుకు అనుమతులు లభిస్తే, వాయిదా పడిన సినిమాలన్నీ ప్రేక్షకుల అలరించనున్నాయి.
ఇది చదవండి:S.S Rajamouli: హాలీవుడ్కు రాజమౌళి