కరోనా గురించి సినిమా తీసేందుకు సిద్ధమవుతున్నాడు టాలీవుడ్ యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఈ విషయాన్ని ధ్రువీకరించాడు. కరోనా వ్యాప్తి ఎలా జరుగుతుంది, ఈ వైరస్ వల్ల ఏర్పడిన పరిస్థితులు, ప్రపంచదేశాలపై ఇది ఏ విధమైన ప్రభావం చూపింది తదితర అంశాలను ఇందులో చూపించనున్నాడు.
'అ!'తో డైరెక్టర్గా పరిచయమయ్యాడు ప్రశాంత్. ఈ సినిమాకు జాతీయ అవార్డూ వచ్చింది. ఈ చిత్రానికి సీక్వెల్ తీసే ఆలోచనలో ఉన్నట్లు గతంలో చెప్పాడు. ఇటీవలే రాజశేఖర్తో 'కల్కి' తీశాడు. అంతంతమాత్రంగానే ప్రేక్షకాదరణ దక్కించుకుందీ సినిమా.