పెళ్లి.. ప్రతి ఒక్కరి జీవితంలో ప్రత్యేకమైన, అందమైన అనుభూతి. తమ స్థాయికి తగ్గట్టు ఉన్నంతలో గుర్తుండిపోయేలా ఈ వేడుకను జరుపుకొంటారు. సెలబ్రిటీల విషయానికొస్తే దాని గురించి చెప్పాల్సిన పనిలేదు. వందలాది ప్రముఖుల మధ్యలో అట్టహాసంగా, అంగరంగ వైభవంగా పది తరాలు గుర్తుండిపోయేలా నిర్వహిస్తారు. అయితే ఈ ఏడాది కరోనా, అందరి ప్లాన్స్ను తారుమారు చేసింది. కలిసి జీవితం పంచుకుందాం అనుకున్న జంటల్లో దుఃఖాన్ని, నిరాశను నింపింది.
ఈ వైరస్ కారణంగా చాలా మంది పెళ్లిలు వాయిదా పడగా మరికొందరు కుటుంబ సభ్యుల సమక్షంలోనే ఈ తంతును ముగించారు. ఇందుకు సెలబ్రిటీల మినహాయింపు ఏం కాదు. వారు కూడా సాదాసీదాగా వివాహ వేడుకను జరుపుకోవాల్సి వచ్చింది. అలా సాధరణ రీతిలో అతి తక్కువ మంది సమక్షంలో ఈ ఏడాది పెళ్లిపీటలు ఎక్కిన సినీ తారలు ఎవరెవరంటే?
కాజల్ అగర్వాల్-గౌతమ్ కిచ్లూ
స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్.. తన ప్రియుడు గౌతమ్ కిచ్లూను పెళ్లి చేసుకోనున్నట్లు అక్టోబర్ 9న ప్రకటించి అందర్ని ఆశ్చర్యపరిచింది. అక్టోబర్ 30న ముంబయిలో కుటుంబసభ్యులు సమక్షంలో వివాహం చేసుకుంది.
రానా-మిహీకా
విలక్షణ నటుడు రానా దగ్గుబాటి.. ప్రేయసి మిహీకా బజాజ్ను కుటుంబసభ్యుల సమక్షంలో ఆగస్టు 8న వివాహమాడారు. హైదరాబాద్లోని రామానాయుడు స్టూడియో ఇందుకు వేదికైంది. వారిద్దరి ప్రేమను పెద్దలు అంగీకరించినట్లు లాక్డౌన్ సమయంలోనే రానా ప్రకటించారు.
నిఖిల్ -పల్లవి
కథానాయకుడు నిఖిల్ వివాహం మే 13న హైదరాబాద్ సమీపంలోని శామీర్పేట్లో ఓ ప్రైవేట్ అతిథి గృహంలో జరిగింది. డా.పల్లవి వర్మను ఆయన ప్రేమించి పెళ్లాడారు.
నితిన్-షాలిని
టాలీవుడ్ హీరో నితిన్.. తాను ప్రేమించిన షాలినిని జులైలో వివాహం చేసుకున్నారు. లాక్డౌన్ కారణంగా నిబంధనలను పాటిస్తూ, సన్నిహితుల సమక్షంలో ఈ వేడుకను నిర్వహించారు.
శ్వేత అగర్వాల్-ఆదిత్య నారాయణ్
దాదాపు పదేళ్లు సహజీవనం చేసి, డిసెంబరు 1న మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు నటి శ్వేత అగర్వాల్- ఆదిత్య నారాయణ్. ప్రముఖ గాయకుడు ఉదిత్ నారాయణ్ తనయుడే ఆదిత్య.
నిఖిల్ గౌడ-రేవతి
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి కుమారుడు, నటుడు నిఖిల్ గౌడ.. ఏప్రిల్లో రేవతిని వివాహమాడారు. రామనగర జిల్లాలోని బిడాది ఫామ్హౌస్లో వీరి పెళ్లి జరిగింది.
దర్శకుడు సుజీత్