తెలంగాణ

telangana

By

Published : Apr 9, 2020, 10:56 AM IST

ETV Bharat / sitara

కరోనా క్రైసిస్​ ఛారిటీకి విరాళాల వెల్లువ

లాక్​డౌన్​ కారణంగా ఎంతోమంది సినీకార్మికులు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నారు. వారిని ఆదుకోవడానికి మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో కరోనా క్రైసిస్​ ఛారిటీ(సీసీసీ) ఏర్పాటైంది. ఈ సహాయనిధికి పలువురు సినీప్రముఖులు విరాళాలను అందజేస్తున్నారు.

Tollywood Celebraties given Funds to Corona Crisis Charity(CCC)
కరోనా క్రైసిస్​ ఛారిటీకి విరాళాల వెల్లువ

కరోనా వల్ల ఉపాధి కోల్పోయిన సినీ కార్మికుల కోసం చిరంజీవి ఆధ్వర్యంలో 'కరోనా క్రైసిస్‌ ఛారిటీ'(సీసీసీ) ఏర్పాటైంది. దీనికి బుధవారం పలువురు సినీ ప్రముఖులు విరాళాలను ప్రకటించారు.

అమరరాజా ఎంటర్​టైన్‌మెంట్స్‌ రూ.10లక్షలు: ప్రముఖ నిర్మాత పద్మావతి గల్లా 'సీసీసీ'కి రూ.10లక్షలు విరాళంగా ప్రకటించింది. తమ నిర్మాణ సంస్థ అమరరాజా మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ తరఫున ఈ సాయం అందిస్తున్నట్లు బుధవారం ఆమె ఓ ప్రకటనలో తెలియజేసింది.

ఆదితో కలిసి సాయికుమార్‌: ప్రముఖ నటుడు సాయికుమార్‌, అతడి తనయుడు, కథానాయకుడు ఆదితో కలిసి 'సీసీసీ'కి రూ.5,00,004 విరాళం అందించారు. డబ్బింగ్‌ యూనియన్‌ అసోసియేషన్‌కు మరో రూ.1,00,008 ఆర్థిక సాయం చేశారు. ఈ సంస్థకు సాయికుమార్‌ సోదరుడు రవిశంకర్‌ రూ.1లక్ష విరాళం ఇచ్చాడు.

యువ కథానాయకుడు సందీప్‌కిషన్‌ నిర్మాత అభిషేక్‌ అగర్వాల్‌తో కలిసి హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో శానిటైజర్లు, మాస్కులు, నిత్యావసరాలు పంపిణీ చేశాడు.

ఇదీ చూడండి.. చిరంజీవికి లాటరీలో ఏం వచ్చిందో తెలుసా?

ABOUT THE AUTHOR

...view details