తెలంగాణ

telangana

By

Published : Feb 22, 2021, 4:31 PM IST

ETV Bharat / sitara

ఫుట్​బాల్​ ఆడుతూ గాయపడ్డ బాలీవుడ్ హీరో

బాలీవుడ్​ హీరో టైగర్​ష్రాఫ్​.. ఛారిటీ ఫుట్​బాల్​ మ్యాచ్​ ఆడుతూ గాయపడ్డాడు. హీరోయిన్ దిశా పటానీ.. ఆ సమయంలో అతడితో పాటే ఉండి జాగ్రత్తగా చూసుకుంది.

Tiger Shroff gets injured during football match
టైగర్​ష్రాఫ్ దిశా పటానీ

ఆదివారం రాత్రి బాలీవుడ్​ నటులు అర్జున్ కపూర్, టైగర్​ష్రాఫ్, అపర్​శక్తి ఖురానా, అహన్ శెట్టి తదితరులు​ ఛారిటీ ఫుట్​బాల్ మ్యాచ్​ ఆడారు. ఓ సమయంలో కాలికి దెబ్బ తగలడం వల్ల టైగర్ మిగతా మ్యాచ్​ ఆడలేకపోయాడు. అది చాలా చిన్న గాయమేనని వైద్యుడు పరీక్షల అనంతరం వెల్లడించారు. దీంతో అతడు స్ట్రైచర్​పై ఉన్నంత సేపు రూమర్ ప్రేయసి దిశా పటానీ పక్కనే ఉండి జాగ్రత్తగా చూసుకుంది.

టైగర్​ష్రాఫ్​ పక్కనే ఉన్న దిశా పటానీ

ప్రస్తుతం 'గణపత్' సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నారు టైగర్​ష్రాఫ్. ఇందులో కృతిసనన్ హీరోయిన్. మరోవైపు 'హీరోపంతి' సీక్వెల్ కోసం సిద్ధమవుతున్నాడు. ఇందులో తారా సుతారియా కథానాయికగా నటించనుంది.

ఇది చదవండి:వాటిని పట్టించుకోవడానికి తీరిక లేదు: దిశా పటానీ

ABOUT THE AUTHOR

...view details