సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య కేసులో సినీ ప్రముఖుల విచారణ ముమ్మరంగా సాగుతోంది. తాజాగా శనివారం బాలీవుడ్ చిత్ర నిర్మాత ఆదిత్యా చోప్రా వాంగ్మూలాన్ని తీసుకున్నారు ముంబయి పోలీసులు. ఆదిత్య బ్యానర్ యశ్రాజ్ ఫిలిమ్స్తో సుశాంత్ కుదుర్చుకున్న ఒప్పందాన్ని ముంబయి పోలీసులు ఇదివరకే పరిశీలించారు. ఇందులో నిర్మాణ సంస్థ సుంచి సుశాంత్ మూడు చిత్రాలకు ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు వెల్లడైంది. అయితే ఆ ఒప్పందాలను ఎందుకు రద్దు చేసుకున్నారనే అంశంపై వివరణ ఇవ్వాలని ఆదిత్యా చోప్రాను పోలీసులు ప్రశ్నించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.
సుశాంత్ కేసులో పోలీస్ స్టేషన్కు ఆదిత్యా చోప్రా - sushanth latest case updates
బాలీవుడ్ హీరో సుశాంత్ మృతి కేసులో భాగంగా ప్రముఖ నిర్మాత ఆదిత్యా చోప్రా వాంగ్మూలాన్ని తీసుకున్నారు ముంబయి పోలీసులు. ఇదివరకే దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ, తదితరులను పోలీసులు విచారించారు.
![సుశాంత్ కేసులో పోలీస్ స్టేషన్కు ఆదిత్యా చోప్రా The statement of Aditya Chopra of Yash Raj Films recorded in Sushant Singh Rajput death case: Mumbai Police](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8075677-489-8075677-1595068408100.jpg)
సుశాంత్
జూన్ 14న సుశాంత్ ముంబయిలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నాడు. అనంతరం ఈ నటుడి మరణానికి పలువురు సినీ ప్రముఖులు కారణమని న్యాయవాది సుధీర్ కుమార్ ఓజా కోర్టులో కేసు వేశారు. ఈ క్రమంలోనే ముంబయి పోలీసులు సుశాంత్ మృతికి గల కారణాలపై విచారణ కొనసాగిస్తున్నారు. అయితే, కొంత మంది సినీ ప్రముఖులు, అభిమానులు సీబీఐ విచారణకు అనుమతి ఇవ్వాలని సామాజిక మాధ్యమాల వేదికగా డిమాండ్ చేస్తున్నారు.