రమ్యకృష్ణ .. 'బాహుబలి' సినిమాతో ఒక్కసారిగా కెరీర్ గ్రాఫ్ పెంచుకుంది. రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రంలో శివగామి పాత్ర పోషించి ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు సంపాదించుకుంది. అప్పటి నుంచి బలమైన పాత్రలకు కేరాఫ్గా మారిందీ నటి. విభిన్న వేషాలు ఆవిష్కరించేందుకు ఎప్పుడూ ముందుండే ఈ సీనియర్ హీరోయిన్ తాజాగా 'కేజీఎఫ్ 2'లో అవకాశం వదులుకుందట.
యశ్ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'కేజీఎఫ్'కు సీక్వెల్గా 'కేజీఎఫ్ 2' తెరకెక్కుతోంది. మొదటి భాగం ప్రేక్షకుల్ని అలరించింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని 'కేజీఎఫ్-2'ను భారీ తారాగణంతో తీర్చిదిద్దే ప్రయత్నంలో ఉన్నాడు దర్శకుడు ప్రశాంత్.