హీరో రామ్.. మాస్ లుక్లో కనిపించి, అలరించిన సినిమా 'ఇస్మార్ట్ శంకర్'. చాలా కాలం తర్వాత ఈ చిత్రంతో దర్శకుడు పూరీ జగన్నాథ్ సూపర్హిట్ అందుకున్నారు. దాదాపు రూ.80 కోట్లకుపైగా కలెక్షన్లు సాధించిందీ చిత్రం. ఈ చిత్ర హిందీ డబ్బింగ్ వెర్షన్కు యూట్యూబ్లో విశేషాదరణ లభిస్తోంది. ఆదిత్య మూవీస్ యూట్యూబ్ ఛానల్లో ఇప్పటివరకు ఈ సినిమాకు 200 మిలియన్ వ్యూస్ వచ్చాయి.
'ఇస్మార్ట్ శంకర్' సూపర్హిట్ కావడం వల్ల ఈ చిత్రానికి కొనసాగింపుగా సీక్వెల్ను రూపొందిస్తారని గతంలో ఊహాగానాలు వినిపించాయి. కొత్త సినిమా కోసం పూరీ జగన్నాథ్ ఇప్పటికే స్టోరీ సిద్ధం చేసినట్లు టాక్. 'ఇస్మార్ట్..'లో నటించిన హీరోయిన్లు నభా నటేష్, నిధి అగర్వాల్.. సీక్వెల్లోనూ కనిపిస్తారని తెలుస్తోంది.