హాలీవుడ్ హిట్ చిత్రం 'ద గర్ల్ ఆన్ ద ట్రైన్'లో నటిస్తోంది బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా. ఈ సినిమా ఫస్ట్లుక్ను ఇన్స్టాగ్రామ్లో పంచుకుందీ భామ. ఓ ఫొటోలో ముఖంపై గాయంతో భయంగా కూర్చుని ఉన్న పరిణీతి.. ఎవరినో తీక్షణంగా చుస్తూ కనిపిస్తోంది.
హీరోయిన్ పరిణీతి చోప్రా ముఖంపై గాయం - adithi rao hydari
హీరోయిన్ పరిణీతి చోప్రా ప్రధాన పాత్రలో 'ద గర్ల్ ఆన్ ద ట్రైన్' రీమేక్గా తెరకెక్కుతున్న బాలీవుడ్ సినిమా ఫస్ట్లుక్ ఆకట్టుకుంటోంది.
![హీరోయిన్ పరిణీతి చోప్రా ముఖంపై గాయం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4201323-944-4201323-1566392367139.jpg)
హీరోయిన్ పరిణీతి చోప్రా
మాతృకలో ఈ పాత్రని ఎమ్లీ బ్లంట్ పోషించింది. విడాకులు తీసుకున్న మహిళ మానసికంగా ఎదుర్కొన్న సమస్యల నేపథ్యంగా ఈ చిత్ర కథ నడుస్తుంది. ఇందులోని మరో కీలక పాత్రలో అదితీరావ్ హైదరీ నటిస్తోంది. గతవారమే లండన్లో షూటింగ్ ప్రారంభమైంది. రిభుదాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రేక్షకుల ముందుకు వచ్చే ఏడాది రానుంది. 'జబారియా జోడి'తో ఇటీవలే సందడి చేసిన పరిణీతి చోప్రా.. సైనా నెహ్వాల్ బయోపిక్లోనూ నటిస్తోంది.
ఇది చదవండి: సల్మాన్తో అదరగొట్టిన స్టార్... ఇప్పుడు 'సైరా'తో....
Last Updated : Sep 27, 2019, 7:31 PM IST