తమిళ థ్రిల్లర్ సినిమా 'తడమ్' హిందీ రీమేక్ నుంచి హీరో సిద్ధార్థ్ మల్హోత్రా తప్పుకొన్నట్లు సమాచారం. కథ, స్క్రీన్ప్లేలో భారీగా మార్పులు చేయడం వల్ల ఈ సినిమా నుంచి దూరమయ్యాడట.
2020 మార్చిలో సిద్ధార్థ్, మృనాల్ థాకూర్ ప్రధాన పాత్రల్లో 'తడమ్' హిందీ రీమ్క్ను తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రానికి వర్ధన్ కేట్కర్ దర్శకుడు. అదే ఏడాది మేలో సినిమాను పట్టాలెక్కించాలని భావించినా కరోనా వల్ల తాత్కాలికంగా నిలిచిపోయింది. ఆ తర్వాత ప్రస్తుతం మళ్లీ తీయాలనే ఆలోచనతో కథ, స్క్రీన్ప్లేలో భారీ మార్పులు చేసి సిద్ధార్థ్ను సంప్రదించారట. అయితే ఈ మార్పులు నచ్చకపోవడం వల్ల సిద్ధార్థ్ ఈ చిత్రంలో నటించడానికి విముఖత చూపించాడని వినికిడి.