చలనచిత్రం... మూకీతో మొదలై మనసు మైమరిపించే స్థాయికి చేరింది. ఒకప్పుడు హాలీవుడ్ సినిమాలతో పోలుస్తూ మన చిత్రాలూ ఇలా ఉంటే బాగుండు అనుకునేవాళ్లం. ప్రస్తుతం పరిస్థితి మారింది హాలీవుడ్కు ఏ మాత్రం తగ్గకుండా భారీ చిత్రాలను తెరకెక్కిస్తున్నారు మన దర్శకులు. మరి ఆ సినిమాలేంటో చూద్దామా..!
- ఆర్ఆర్ఆర్..
బాహుబలితో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తం చేసిన దర్శకుడు రాజమౌళి. ఆయన దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్చరణ్ కలిసి నటిస్తోన్న చిత్రం 'ఆర్ఆర్ఆర్'. 400 కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ సినిమా చారిత్రక నేపథ్యంలో తెరకెక్కుతుంది. అల్లూరిగా చెర్రీ, కుమ్రం భీంగా తారక్ నటిస్తున్నారు. ఆలియా భట్, జైసీ ఎడ్గర్ జోన్స్ కథానాయికలు. వచ్చే ఏడాది జులై 30న ప్రేక్షకుల ముందుకు రాబోతుందీ చిత్రం.
- సైరా..
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం సైరా. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా ఈ సినిమా రూపొందిస్తున్నారు. రూ. 250 కోట్ల బడ్జెట్తో నిర్మిస్తున్నఈ చిత్రానికి నిర్మాత రామ్చరణ్. నయనతార కథానాయికగా, బిగ్ బీ అమితాబ్ కీలకపాత్రలో నటిస్తున్నారు. త్వరలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
- సాహో...