తెలంగాణ

telangana

By

Published : Mar 30, 2020, 5:54 PM IST

ETV Bharat / sitara

తారక్ సినిమాతో జాన్వీ కపూర్ టాలీవుడ్​లోకి ఎంట్రీ!

జూ.ఎన్టీఆర్​ కొత్త సినిమాలో హీరోయిన్​గా అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్​ నటించనుందని సమాచారం. ఈ విషయంపై త్వరలో స్పష్టత వచ్చే అవకాశముంది.

SRIDEVI DAUGHTER JANVI KAPOOR
త్వరలోనే తెలుగు తెరపై అతిలోక సుందరి కుమార్తె?

జూ.ఎన్టీఆర్​- త్రివిక్రమ్​ కాంబినేషన్​లో రెండేళ్ల క్రితం వచ్చిన 'అరవింద సమేత వీర రాఘవ' సినిమా బాక్సాఫీస్​ ముందు కాసుల వర్షం కురిపించింది. ఇప్పుడు వీరిద్దరూ మరోసారి కలిసి పనిచేయనున్నట్లు ఇటీవలే ప్రకటించారు. ప్రస్తుతం పూర్వ నిర్మాణనంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయితే ఇందులో హీరోయిన్ ఎవరనే విషయం ఆసక్తి నెలకొంది.

జాన్వీ టాలీవుడ్ ఎంట్రీ?

ఈ ప్రాజెక్టులో హీరోయిన్​గా శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ను తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్​లో నటించేందుకు ఇప్పటికే జాన్వీ ఉత్సాహం చూపిస్తోంది. ఈ తరుణంలో అన్నీ అనుకున్నట్లు సాగితే, ఆమెను త్వరలో తెలుగు తెరపై చూడొచ్చు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ.. కార్గిల్‌ యుద్ధ వనిత గుంజన్‌ సక్సేనా జీవితం ఆధారంగా తీస్తున్న 'గుంజన్‌ సక్సేనా: ది కార్గిల్‌ గర్ల్‌' అనే సినిమాలో నటిస్తోంది.

ఇదీ చదవండి:రాములోరి పండక్కి 'ఆచార్య' ఫస్ట్​లుక్!

ABOUT THE AUTHOR

...view details