తెలంగాణ

telangana

By

Published : Mar 6, 2020, 8:36 PM IST

ETV Bharat / sitara

గోపీచంద్‌తో తలపడుతున్న తరుణ్‌ అరోరా

గోపీచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాలో విలన్​గా తరుణ్ అరోరా కనిపించనున్నాడు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది చిత్రబృందం.

Tarun Arora
Tarun Arora

ప్రముఖ నటుడు తరుణ్‌ అరోరా మరోసారి తెలుగు తెరపై విలనిజం చూపించబోతున్నాడు. 'ఖైదీ నంబరు 150', 'అర్జున్‌ సురవరం' చిత్రాల్లో ప్రతినాయకుడిగా మెప్పించిన అరోరా ప్రస్తుతం గోపీచంద్‌తో తలపడేందుకు సిద్ధమయ్యాడు. గోపీచంద్‌ హీరోగా దర్శకుడు సంపత్‌ నంది 'సీటీమార్‌' చిత్రం తెరకెక్కిస్తున్నాడు. శ్రీనివాస సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై నిర్మితమవుతోంది. ఈ చిత్రంలో విలన్‌ పాత్రకు ఎంపికయ్యాడు తరుణ్‌.

ఇటీవలే ప్రారంభమైన మూడో షెడ్యూల్‌ చిత్రీకరణలో పాల్గొన్నాడు తరుణ్. సెట్‌లో అడుగుపెట్టి, డైలాగులు అభ్యాసం చేస్తున్న అరోరాకు సంబంధించిన ఓ వీడియోను విడుదల చేసింది చిత్ర బృందం. తరుణ్‌ ఇందులో సరికొత్త లుక్‌తో దర్శనమిచ్చి ఆసక్తి పెంచుతున్నాడు. నాయకా, ప్రతినాయకుల మధ్య సంభాషణలు ప్రధానంగా నిలుస్తాయట. గోపీచంద్‌ సరసన తమన్నా నటిస్తోంది. భూమిక చావ్లా, దిగంగ సూర్యవంశీ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కబడ్డీ నేపథ్యంలో రూపొందుతోందీ చిత్రం. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.

ABOUT THE AUTHOR

...view details