తెలంగాణ

telangana

By

Published : Aug 8, 2019, 6:39 PM IST

ETV Bharat / sitara

'సుష్మా స్వరాజ్​ పాత్రలో నటించేందుకు సిద్ధం'

దివంగత విదేశాంగశాఖ మాజీ మంత్రి సుష్మా స్వరాజ్​ బయోపిక్​ తీస్తే.. అందులో నటించేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పింది హీరోయిన్​ తాప్సీ. ఈమె నటించిన 'మిషన్​ మంగళ్' ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.

హీరోయిన్​ తాప్సీ

బాలీవుడ్​ సినిమా 'మిషన్​ మంగళ్' ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉంది హీరోయిన్​ తాప్సీ. విభిన్న బయోపిక్​లతో ఇప్పటికే మంచి పేరు తెచ్చుకున్న ఈ కథానాయిక... దివంగత భాజపా నాయకురాలు సుష్మా స్వరాజ్​ జీవిత చరిత్రలోనూ నటించాలని ఉందని చెప్పింది. విదేశాంగ శాఖ మాజీ మంత్రి మృతికి సంతాపం తెలిపిన తాప్సీ... ఆమెకు సంబంధించిన అంశంపై మాట్లాడింది.

"సుష్మాజీ అంటే నాకు చాలా ఇష్టమే కాదు విపరీతమైన గౌరవం. అలాంటి వ్యక్తి బయోపిక్​ తీస్తే కచ్చితంగా అందులో నటించేందుకు సిద్ధంగా ఉన్నా. స్త్రీ అంటే ఆమెలాగ ఉండాలి. అందుకే అలాంటి గొప్ప రాజకీయ నాయకురాలి పాత్రను ఎవరూ వదులుకోరు. భారతీయ కట్టుబొట్టుకు నిలువెత్తు నిదర్శనం సుష్మ. ఆ లెజెండరీ నాయకురాలి జీవితంపై సినిమా తీయాలనుకునే నిర్మాతలకు ఎప్పుడూ అందుబాటులోనే ఉంటా." -తాప్సీ, సినీ నటి.

అక్షయ్‌కుమార్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'మిషన్‌ మంగళ్‌.' ప్రఖ్యాత రాకేశ్​ ధావన్​ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. తాప్సీ, విద్యాబాలన్‌, సోనాక్షి సిన్హా, నిత్యా మేనన్‌.. శాస్త్రవేత్తల పాత్రల్లో నటించారు. జగన్‌ శక్తి దర్శకుడు. అమిత్‌ త్రివేది సంగీతం సమకూర్చాడు. ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

ఇది చదవండి: శక్తిమంతమైన మహిళకు సినీ లోకం అశ్రు నివాళి


ABOUT THE AUTHOR

...view details