తెలంగాణ

telangana

By

Published : Nov 16, 2019, 5:27 PM IST

ETV Bharat / sitara

మరోసారి 'మన్మథ'గా మారనున్న శింబు..!

చాలా ఏళ్లుగా విజయం కోసం ఎదురుచూస్తున్న తమిళ హీరో శింబు తన పాత దారిని ఎంచుకోనున్నాడు. 15 ఏళ్ల క్రితం భారీ విజయం సాధించిన ఓ సినిమాకు సీక్వెల్​ రూపొందించి మళ్లీ ఫామ్​లోకి రావాలని చూస్తున్నాడు.

మరోసారి 'మన్మథ'గా మారనున్న శింబు..!

కొన్నేళ్ల క్రితం వరుస సినిమాలతో తీరిక లేకుండా గడిపిన తమిళ స్టార్‌ హీరో శింబుకు కొంతకాలంగా ఏదీ కలిసి రావట్లేదు. ఓ హిట్టు మాట వినేందుకు ఎంత కష్టపడుతున్నప్పటికీ బాక్సాఫీస్‌ వద్ద నిరాశే ఎదురవుతోంది. ఆ మధ్య తెలుగు హిట్‌ మూవీ 'అత్తారింటికి దారేది' చిత్రాన్ని 'వంత రాజవతాన్‌ వరువేన్‌' పేరుతో తమిళంలోకి రీమేక్‌ చేసి ప్రేక్షకుల్ని పలకరించాడు. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకు ఆదరణ మాత్రం దక్కలేదు.

ఈసారి కచ్చితంగా హిట్టు కొట్టాలనే పట్టుదలతో శింబు ఓ మాస్టర్‌ ప్లాన్‌ వేశాడు. 15ఏళ్ల క్రితం వచ్చిన తన క్లాసిక్‌ హిట్‌ చిత్రానికి సీక్వెల్‌ను చేయాలని సిద్ధమయ్యాడు. ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసా? తమిళం, తెలుగులో శింబుకి మంచి పేరు తెచ్చిపెట్టిన 'మన్మథ'. జ్యోతిక, సింధు తులానీ కథానాయికలుగా నటించిన ఈ వైవిధ్య ప్రేమకథా చిత్రం అప్పట్లో కుర్రకారును విశేషంగా ఆకట్టుకుంది. ఇప్పుడీ సినిమాకు సీక్వెల్‌ను తీసుకొచ్చి తన మార్కెట్‌ను మళ్లీ ఫామ్​లోకి తీసుకురావాలన్న ఆలోచనలో ఉన్నాడట శింబు.

ఇప్పటికే ఓ ప్రముఖ రచయితతో కలిసి కథను సిద్ధం చేయించుకుంటున్నాడట. మరి ఈ వార్తల్లో వాస్తవమెంతన్నది తెలియనప్పటికీ ఒకవేళ ఈ ప్రాజెక్టుతో శింబు అడుగుపెడితే అటు తమిళంలోనూ ఇటు తెలుగులోనూ ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడే అవకాశముంది.

ABOUT THE AUTHOR

...view details