తెలంగాణ

telangana

తెలుగులో పదేళ్ల తర్వాత టబు మళ్లీ అలా

By

Published : Dec 16, 2019, 7:56 PM IST

దాదాపు పదేళ్ల తర్వాత తెలుగులో రీఎంట్రీ ఇస్తున్న నటి టబు.. 'అల వైకుంఠపురములో' సినిమా కోసం సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంటోందట.

తెలుగులో పదేళ్ల తర్వాత టబు మళ్లీ అలా
నటి టబు

ప్రముఖ నటి టబు.. టాలీవుడ్‌కు దూరమై సుమారు పదేళ్లవుతుంది. 'పాండురంగడు' సినిమాలో చివరగా కనిపించిన ఈ భామ.. ఇప్పుడు 'అల వైకుంఠపురములో' చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తుంది. అల్లు అర్జున్‌ హీరోగా నటిస్తున్నాడు. పూజా హెగ్డే హీరోయిన్. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో ఈ ముద్దుగుమ్మ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ సినిమా కోసం సొంత గొంతు వినిపించనుందట టబు.

'అల వైకుంఠపురములో' చిత్రబృందం

సొంతంగా డబ్బింగ్​ చెప్పేందుకు టబు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు తెలుస్తోంది. నటనకు తగ్గ వాయిస్‌ అందించేందుకు కేర్‌ తీసుకుంటోందట చిత్రబృందం. ఇన్నేళ్ల తర్వాత ఈమె పునరాగమనం చేస్తుండటం వల్ల ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. ఇప్పటికే వచ్చిన ఈ చిత్ర పోస్టర్లు, పాటలు, టీజర్‌ సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి. వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుందీ చిత్రం.

ABOUT THE AUTHOR

...view details