మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు శుభవార్త. సైరా చిత్ర షూటింగ్ ముగిసింది. ఈ విషయాన్ని ఆ చిత్రానికి సినిమాటోగ్రాఫర్గా పనిచేస్తున్న రత్నవేలు ట్విట్టర్లో పంచుకున్నాడు. ఈ సందర్భంగా సైరా టీమ్ మొత్తానికి కృతజ్ఞతలు తెలిపాడు. 2017 నుంచి సుధీర్ఘ కాలంగా షూటింగ్ జరుపుకుంటోందీ చిత్రం.
"సైరా చిత్రం షూటింగ్ పూర్తయింది. చిత్రానికి పని చేసిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. ఈ సినిమా ఎన్నో జ్ఞాపకాలను మిగిల్చింది. సినిమా అద్భుతంగా వచ్చింది" -రత్నవేలు, సైరా చిత్ర సినిమాటోగ్రాఫర్