తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సుశాంత్​ పెంపుడు శునకానికి ఏమైంది?

బాలీవుడ్​ నటుడు సుశాంత్​ మృతితో తన పెంపుడు శునకం ఫడ్జ్ కూడా​ కలత చెంది మృతిచెందిందని నెట్టింట్లో వార్తలు గుప్పుమంటున్నాయి. అయితే ఈ వార్తలు అవాస్తమని కొట్టిపారేశారు సుశాంత్​ సన్నిహితులు.

By

Published : Jun 24, 2020, 11:01 AM IST

sushanth
సుశాంత్​ పెంపుడు శునకం

బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌కు తన పెంపుడు శునకం ఫడ్జ్ అంటే విపరీతమైన ప్రేమ. ఫడ్జ్‌తో సరదాగా గడిపిన వీడియోలను సుశాంత్‌ పలు సందర్భాల్లో సోషల్‌ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. అయితే, ఇటీవల సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ ఆత్మహత్య తర్వాత ఫడ్జ్‌ బెంగ పెట్టుకొని.. ఫొటోని చూస్తూ కంటతడి పెట్టుకున్న చిత్రాలు కొంతకాలం నుంచి నెట్టింట్లో వైరల్‌గా మారాయి.

అయితే సుశాంత్‌ మృతిని తట్టుకోలేక ఇటీవల ఫడ్జ్ కూడా‌ మృతి చెందిందని కొన్నిరోజుల నుంచి సోషల్‌మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఎలాంటి ఆహారం తీసుకోకపోవడం వల్ల మరణించిందని నెట్టింట్లో వరుస పోస్టులు దర్శనమిస్తున్నాయి. దీంతో నెటిజన్లు భావోద్వేగానికి గురవుతున్నారు.

సుశాంత్​ పెంపుడు శునకం

అయితే సదరు వార్తలపై సుశాంత్‌ సన్నిహితులు స్పందించారు. పెంపుడు శునకం మృతి వార్తల్లో ఎలాంటి నిజంలేదని చెప్పారు. ప్రస్తుతం ఫడ్జ్‌ సుశాంత్‌ ఇంట్లోనే ఉందని, అంతేకాకుండా అది ఆరోగ్యంగా ఉందని చెప్పుకొచ్చారు.

సుశాంత్​ పెంపుడు శునకం

ఇది చూడండి : 'ఆ రహస్యం నీతో పాటే వెళ్లిపోయింది సుశాంత్​'

ABOUT THE AUTHOR

...view details