తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సుశాంత్​ మృతి.. బాలీవుడ్​లో కోల్డ్ వార్ - susanth news

బాలీవుడ్​ యువ హీరో సుశాంత్​ సింగ్​ రాజ్​పుత్​ చనిపోయిన తర్వాత బాలీవుడ్​లో విమర్శల పర్వం మొదలైంది. రెండు బృందాలుగా విడిపోయిన చిత్రపరిశ్రమ.. ఒకరిపై మరొకరు ఘాటైన వ్యాఖ్యలు చేసుకునేందుకు కారణం అవుతోంది. పలువురు నటీనటులు తమ అభిప్రాయాలు, ఎదుర్కొన్న సంఘటనలు చెప్పేందుకు సుశాంత్​ పేరును తెరపైకి తీసుకొస్తున్నారు.

susanth latest news
సుశాంత్​ మృతితో బ్రేక్​ అయిన బాలీవుడ్​...

By

Published : Jul 24, 2020, 6:11 PM IST

బాలీవుడ్​ పరిశ్రమ సుశాంత్​ సింగ్​ రాజ్​పుత్ ఆత్మహత్యతో రెండు ముక్కలైంది. చూస్తుండగానే నెపోటిజం, ఇన్​సైడర్​-ఔట్​సైడర్​, మెయిన్​స్ట్రీమ్​ వర్సెస్​ ఇండీ సినిమా అంటూ నటీనటులు మాట్లాడటం మొదలుపెట్టారు. కొందరు సామాజిక మాధ్యమాల్లో బెదిరింపులు ఎదుర్కొంటే, మరికొందరు సహనటులపైనే విమర్శలు చేయడం ప్రారంభించారు.

34 ఏళ్ల సుశాంత్​.. జూన్​ 14న ముంబయి బాంద్రాలోని తన అపార్ట్​మెంటులో బలన్మరణానికి పాల్పడ్డాడు. అప్పట్నుంచే చిత్రపరిశ్రమలో లోటుపాట్లపై రగడ మొదలైంది. అయితే ఈ నటుడి మృతిపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. పలువురు సెలబ్రిటీలు ఆదిత్యా చోప్రా, సంజయ్​ లీలా భన్సాలీ, జర్నలిస్ట్​ రాజీవ్​ మసంద్​ వంటి వారిని విచారించారు. మరణానికి మానసిక సమస్యలే కారణంగా భావిస్తోన్న తరుణంలో.. చిత్రపరిశ్రమలో కొందరి రాజకీయాల వల్లే సుశాంత్​ చనిపోయాడని మరింత చర్చ ప్రారంభమైంది.

ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తూ నటి కంగనా రనౌత్​.. నిర్మాతలు ఆదిత్యా చోప్రా, కరణ్​ జోహర్​ సహా తాప్సీ, స్వర భాస్కర్​, అనురాగ్​ కశ్యప్​, రణ్​వీర్​ షోరేపైనా ట్విట్టర్​ వేదికగా విమర్శలు చేసింది. అయితే ఇదే సమయంలో అనూహ్యంగా బాలీవుడ్​ను వీడుతున్నట్లు ప్రకటించారు ప్రముఖ దర్శకుడు అనుభవ్​ సిన్హా. తప్పడ్​, ముల్క్​ వంటి చిత్రాలతో తప్ప తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు లేదని అభిప్రాయపడ్డారు. ఇలాంటి సమయంలో బాలీవుడ్​ను వదిలి భారతీయ సినిమాకు వెళ్లు అంటూ.. సిన్హా నిర్ణయానికి స్పందించారు మరో దర్శకుడు సుధీర్​ మిశ్రా.

ఆ తర్వాత రాజ్​పుత్ మరణాన్ని హత్యగా పోల్చిన కంగన.. పలువురు సెలబ్రిటీలపై విమర్శలు గుప్పించింది. బాలీవుడ్​లోని కొంతమంది ప్రముఖులు సుశాంత్​ను ఫ్లాప్​​ స్టార్​గా ప్రమోట్​ చేశారని ఆరోపించింది. 'పంగా' సినిమాలో తన సహనటి రిచా చద్దాను, 'తను వెడ్స్​ మను' సహనటి స్వర భాస్కర్ సహా మరో నటి తాప్సీ​ని వివాదంలోకి లాగింది కంగన. వారు బంధుప్రీతిపై మాట్లాడటం లేదని ఆరోపిస్తూ.. 'బీ గ్రేడ్'​ స్టార్​లుగా పోల్చింది.

కంగన.. కౌంటర్​కు ఊరుకోని తాప్సీ.. గతంలో రనౌత్​ స్టార్​ వారసుల గురించి మాట్లాడిన త్రో బ్యాక్​ వీడియోను ట్విట్టర్​లో పోస్టు చేసింది. ఎంట్రన్స్​ ఎగ్జామ్స్​లో కోటా ఉన్నట్లే.. ఇండస్ట్రీలో స్టార్​ కిడ్స్​కు కోటా ఉంటుందన్న కంగన వ్యాఖ్యలపై విమర్శలు చేసింది తాప్సీ. అయితే ఇదే సమయంలో బాలీవుడ్​ దర్శకుల గురించి కీలక వ్యాఖ్యలు చేసింది రిచా చద్దా. పిలిచినప్పుడు గదికి వెళ్లకపోతే హీరోయిన్లను సినిమాల నుంచి తొలగించిన సందర్భాలు ఉన్నాయని అభిప్రాయపడింది. బాలీవుడ్​లో ఇన్​సైడర్స్​(వారసులు)-అవుట్​సైడర్స్​(ఇండస్ట్రీతో సంబంధం లేకుండా వచ్చినవాళ్లు)అని రెండు వర్గాలు ఉన్నాయని చెప్పిన రిచా.. ఇందులోనూ మంచి, చెడ్డ వ్యక్తులు ఉన్నారని స్పష్టం చేసింది.

అయితే సుశాంత్​ విషయంలో సినీ పరిశ్రమ తీరును ఎండగట్టేలా మాట్లాడిన రనౌత్​పై ప్రశంసలు కురిపించాడు అపూర్వ అశ్రాని. నెపోటిజం అంశంపై మాట్లాడటాన్ని స్వాగతించాడు. కంగానకు మద్దతుగా సిమి గరెవాల్​ నిలిచింది. బంధుప్రీతి నుంచి మూవీ మాఫియా వంటి అంశాలపై ఘాటుగా స్పందిస్తోన్న నటి కంగన..ఓ ధైర్యవంతురాలని ఆమె కితాబిచ్చింది. అయితే అనూహ్యంగా రనౌత్​ నటించిన క్వీన్​ సినిమా నిర్మాత అనురాగ్​ కశ్యప్​ కూడా ఈ వివాదంలోకి చేరాడు. విజయాలు, పవర్​ అనేవి అందర్నీ ఒకే విధంగా ఎఫెక్ట్​ చేస్తాయని చెప్పాడు. అయితే కశ్యప్​ విషయంలోనూ రాజీ పడని కంగన.. అతడిపైనా ఫైర్​ అయింది. మినీ మహేశ్​ భట్​ అంటూ సంభోదించింది. తనపై విమర్శలకు స్పందించిన కశ్యప్​.. తనవైపు మాట్లాడకపోతే కంగన శత్రువుగా భావిస్తుందని చెప్పుకొచ్చాడు. అలాంటి భావాల నుంచి బయటకు రావాలని సూచించాడు.

సుశాంత్​ అరంగేట్ర సినిమా 'కై పో చే' తీసిన ముఖేశ్​ ఛబ్రా.. అదే యువ హీరో ఆఖరి చిత్రం 'దిల్​ బెచారా'ను తెరకెక్కించాడు. అయితే తన స్నేహితుడు చివరి సినిమా చూడలేదన్న బాధ ఉండిపోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు. హీరో​ మృతిపై మాట్లాడిన విద్యాబాలన్​.. అతడు ఎందుకు జీవితాన్ని అర్ధాంతరంగా ముగించాడో తెలియదని ఇంకెప్పటికీ అది రహస్యమే అని అభిప్రాయపడింది. అయితే సైలెంట్​గా ఉండటం వల్ల అతడికి గౌరవం ఇచ్చినవాళ్లం అవుతామని పేర్కొంది.

ABOUT THE AUTHOR

...view details