తెలంగాణ

telangana

By

Published : Jun 16, 2020, 6:13 PM IST

ETV Bharat / sitara

ఏడు సినిమాలు కోల్పోయిన సుశాంత్.. కారణమిదే!

బాలీవుడ్​లో ఉన్న కూర్రత్వమే సుశాంత్​ మరణానికి కారణమైందని ఆరోపించారు ప్రముఖ రాజకీయ నాయకుడు సంజయ్​ నిరుపమ్​. 'చిచోరే' విజయం తర్వాత సుశాంత్​ ఏడు సినిమాను అంగీకరించాడని.. అయితే ఆరు నెలల్లోనే వాటి నుంచి అతడిని తప్పించారని వెల్లడించారు సంజయ్​.

Sushant lost 7 films in span of 6 months: Sanjay Nirupam
ఆరు నెలల్లో ఏడు సినిమాలను కోల్పోయిన సుశాంత్​!

బాలీవుడ్​ హీరో సుశాంత్​సింగ్​ రాజ్​పుత్​ గత ఆరు నెలల్లో ఏడు సినిమాలను కోల్పోయాడని రాజకీయ నాయకుడు సంజయ్​ నిరుపమ్​ తెలిపారు. గతేడాది విడుదలైన 'చిచోరే' విజయం తర్వాత సుశాంత్​ ఏడు సినిమాలను అంగీకరించాడని.. అయితే ఆరు నెలల కాలంలోనే అవన్నీ అతడి నుంచి చేజారిపోయాయని వెల్లడించారు. అయితే ఆ సినిమాలేంటి అనేది మాత్రం సంజయ్​ నిరుపమ్​ స్పష్టత ఇవ్వలేదు. ​

"చిచోరే' సినిమా విజయం సాధించిన తర్వాత సుశాంత్​ ఏడు సినిమాలను అంగీకరించాడు. అయితే ఆరు నెలల్లోనే అవన్నీ చేజారిపోయాయి. ఎందుకంటే? చిత్రపరిశ్రమలో క్రూరత్వం ఎక్కువ. అదే సుశాంత్​ మరణానికి కారణమైంది. మనం ప్రతిభావంతుడైన నటుడిని కోల్పోయాము. సుశాంత్​కు నా శ్రద్ధాంజలి"

- సంజయ్​ నిరుపమ్​, రాజకీయ నాయకుడు

'పవిత్ర రిష్టా' అనే టీవీ సీరియల్​తో సుశాంత్​సింగ్ రాజ్​పుత్​ కథానాయకుడిగా ఎదిగాడు. ఆ తర్వాత 2013లో విడుదలైన 'కై పో చే' బాలీవుడ్​లో అరంగేట్రం చేసి.. 'ధోని: అన్​టోల్డ్​ స్టోరీ', 'సోంచిరియా', 'కేదార్​నాథ్​', 'డిటెక్టివ్​ బ్యోమకేశ్​ బక్షి' సినిమాలతో నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్నాడు.

ఇదీ చూడండి...'గ్రాండ్ మస్తీ' భామ జబర్దస్త్ క్లిక్స్​

ABOUT THE AUTHOR

...view details