ఇటీవలే ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'దర్బార్' షూటింగ్ను పూర్తి చేసుకున్నాడు సూపర్స్టార్ రజనీకాంత్. వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం. అయితే ఈలోపు మరో కొత్త ప్రాజెక్టును ప్రారంభించాలని చూస్తున్నాడు తలైవా. ఈ మేరకు తాజాగా168వ సినిమాకు ఓకే చెప్పేశాడు. ఇందులో రజనీ సరసన కథానాయికగా కీర్తి సురేశ్ను పరిశీలిస్తున్నారట.
'దర్బార్' తర్వాత రజనీ కొత్త ప్రాజెక్టు ఇదే..? - pongal 2020 released rajani movie
తమిళ సూపర్స్టార్ రజనీకాంత్ మరో ప్రాజెక్టుకు ఓకే చెప్పేశాడు. ఆయన కెరీర్లో 168వ సినిమాగా ఇది తెరకెక్కనుంది. ఇటీవలే దర్బార్ చిత్రీకరణ పూర్తి చేసుకున్నాడు తలైవా.
దర్బార్ తర్వాత రజనీ కొత్త ప్రాజెక్టు సినిమా..?
గ్రామీణ కథలతో వచ్చి సూపర్ హిట్ కొట్టిన 'యజమాన్', 'పాడయప్ప' తరహాలో ఇది ఉండబోతోందట. ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. అజిత్తో 'వీరం', 'వేదాలం', 'వివేకం', 'విశ్వాసం' వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను తెరకెక్కించిన శివ ఈ సినిమా దర్శకుడు. డి.ఇమాన్ సంగీతం అందించనున్నాడు. 2020 దీపావళి కానుకగా సినిమాను విడుదల చేసేందుకు ప్రణాళిక రచించింది చిత్రబృందం.