తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'దర్బార్'​ తర్వాత రజనీ కొత్త ప్రాజెక్టు ఇదే..?

తమిళ సూపర్​స్టార్​ రజనీకాంత్​ మరో ప్రాజెక్టుకు ఓకే చెప్పేశాడు. ఆయన కెరీర్​లో 168వ సినిమాగా ఇది తెరకెక్కనుంది. ఇటీవలే దర్బార్​ చిత్రీకరణ పూర్తి చేసుకున్నాడు తలైవా.

By

Published : Nov 13, 2019, 9:04 PM IST

దర్బార్​ తర్వాత రజనీ కొత్త ప్రాజెక్టు సినిమా..?

ఇటీవలే ఏఆర్​ మురుగదాస్​ దర్శకత్వంలో తెరకెక్కిన 'ద‌ర్బార్‌' షూటింగ్‌ను పూర్తి చేసుకున్నాడు సూపర్​స్టార్​ రజనీకాంత్​. వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం. అయితే ఈలోపు మరో కొత్త ప్రాజెక్టును ప్రారంభించాలని చూస్తున్నాడు తలైవా. ఈ మేరకు తాజాగా168వ సినిమాకు ఓకే చెప్పేశాడు. ఇందులో రజనీ సరసన కథానాయికగా కీర్తి సురేశ్​ను పరిశీలిస్తున్నారట.

నటి కీర్తి సురేశ్

గ్రామీణ కథలతో వచ్చి సూపర్ హిట్ కొట్టిన 'యజమాన్', 'పాడయప్ప' తరహాలో ఇది ఉండబోతోందట. ప్రముఖ నిర్మాణ సంస్థ స‌న్ పిక్చ‌ర్స్ ఈ చిత్రాన్ని నిర్మించ‌నుంది. అజిత్‌తో 'వీరం', 'వేదాలం', 'వివేకం', 'విశ్వాసం' వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల‌ను తెరకెక్కించిన శివ ఈ సినిమా దర్శకుడు. డి.ఇమాన్ సంగీతం అందించ‌నున్నాడు. 2020 దీపావళి కానుకగా సినిమాను విడుదల చేసేందుకు ప్రణాళిక రచించింది చిత్రబృందం.

ABOUT THE AUTHOR

...view details