తెలంగాణ

telangana

By

Published : Dec 5, 2019, 11:17 AM IST

ETV Bharat / sitara

కొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టిన హీరో సందీప్ కిషన్

యువ కథానాయకుడు సందీప్ కిషన్ కొత్తగా ఓ వ్యాపారాన్ని ప్రారంభించనున్నాడు. ఈ హీరోకు ఇప్పటికే జంట నగరాల్లో పలు రెస్టారెంట్లు ఉన్నాయిు. తాజాగా అమరావతిలో ఓ సెలూన్​ను ప్రారంభించనున్నాడు.

Sundeep
సందీప్

కథానాయకుడిగా, నిర్మాతగా ఈ ఏడాది సందీప్ కిషన్ మంచి విజయాలు అందుకున్నాడు. ఈ హీరో నిర్మాతగా పరిచయమైన చిత్రం 'నిను వీడని నీడను నేనే'. నిర్మాతలకు లాభాలు తీసుకొచ్చిన ఆ సినిమా, కథానాయకుడిగా సందీప్ కిషన్‌కు మంచి విజయం అందించింది. అలాగే, 'తెనాలి రామకృష్ణ'తో కమర్షియల్ విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు కిషన్. ఈ సంతోష సమయంలో తల్లిదండ్రులకు బెంజ్ జిఎల్ఈ 350డి కారును బహుమతిగా ఇచ్చాడు.

సందీప్ కిషన్ నటుడు, నిర్మాత మాత్రమే కాదు. మంచి వ్యాపారవేత్త కూడా. జంట నగరాలు హైదరాబాద్, సికింద్రాబాద్​లో 'వివాహ భోజనంబు' పేరుతో ఈ హీరోకు పలు రెస్టారెంట్లు ఉన్నాయి. విజయవంతంగా రెస్టారెంట్ నిర్వహిస్తున్న అతడు, కొత్తగా మరో వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో త్వరలో ఒక సెలూన్​ను ప్రారంభించనున్నాడు.

స్టైలిష్ రంగంలో పేరొందిన క్యూబీఎస్ సెలూన్ ఫ్రాంచైజీని సందీప్ కిషన్ తీసుకున్నాడు. త్వరలో ఆ సెలూన్ ప్రారంభం కానుంది. ఇక, సినిమాల విషయానికి వస్తే... హాకీ నేపథ్యంలో సందీప్ కిషన్ 'ఏ1 ఎక్స్‌ప్రెస్' అనే చిత్రంలో నటిస్తున్నాడు.

ఇవీ చూడండి.. తొమ్మిదేళ్ల తర్వాత 'డార్లింగ్‌'తో మరోసారి..?

ABOUT THE AUTHOR

...view details