సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి కేసు విచారణలో భాగంగా ప్రధాన నిందితురాలు రియా చక్రవర్తిని అరెస్టు చేసింది నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో. సుశాంత్ మరణానికి సంబంధించి డ్రగ్ కోణంలో మూడు రోజులుగా రియాను ఎన్సీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలోనే మంగళవారం ఉదయం 9:33 గంటలకు ఎన్సీబీ ఎదుట రియా హాజరైంది. అనంతరం ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
ఇటీవలే రియా సోదరుడు షోవిక్ చక్రవర్తితో పాటు మేనేజర్ శామ్యూల్ మిరండాను అరెస్ట్ చేశారు అధికారులు.
Last Updated : Sep 8, 2020, 5:02 PM IST