తెలంగాణ

telangana

By

Published : Jan 16, 2020, 5:44 PM IST

ETV Bharat / sitara

'లుంగీని మహేశ్​ ఇంకొంచెం పైకి లేపుతాడా అని చూశారు'

'సరిలేరు నీకెవ్వరు' చిత్ర ప్రచారంలో భాగంగా హీరోలు వెంకటేశ్, మహేశ్ ప్రత్యేక ముఖాముఖిలో పాల్గొన్నారు. వీరితో పాటు చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి కూడా సందడి చేశాడు. ఈ సందర్భంగా వీరు కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

Special Chit Chat With Venkatsh, Mahesh, Anil Ravipudi Interview
సరిలేరు నీకెవ్వరు చిత్ర బృందం

చిన్నోడు పెద్దోడు మళ్లీ కలిశారు. అదేనండి చిన్నోడంటే మహేశ్.. పెద్దోడంటే వెంకటేశ్.. అయితే ఈసారి సినిమా కోసం కాదు.. చిత్ర ప్రచారం కోసం కలిసి సందడి చేశారు. 'సరిలేరు నీకెవ్వరు' ప్రచారంలో భాగంగా దర్శకుడు అనిల్​తో కలిసి ప్రత్యేక ముఖాముఖిలో పాల్గొన్నారు.

ఈ చిత్రంలో మైండ్ బ్లాక్ సాంగ్​పై మీ స్పందన ఏంటని దర్శకుడు అనిల్ అడగ్గా.. ఇలాంటి పాటలో మహేశ్​ను చూడాలని ఫ్యాన్స్​ చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారని వెంకీ బదులిచ్చాడు.

వెంకటేశ్

"నువ్వు(అనిల్ రావిపూడి) లుంగీతో వేయించావమ్మా. అక్కడ ఆడవాళ్లంతా ఔట్. సాధారణంగా హీరోయిన్లను అలా చూస్తాం. కానీ, మహేశ్​ ఇంకెప్పుడు కొంచెం లుంగీ పైకిలేపుతాడా, కాళ్లు కనపడతాయా అని చూశారు. మైండ్ బ్లాక్ స్టెప్స్ కూడా భలే కుదిరాయి" - వెంకటేశ్​

'సీతమ్మ వాకిట్లో సిరిమల్లే చెట్టు' సినిమాలో మీ ఇద్దరి బెస్ట్ మూమెంట్ ఏంటని మహేశ్, వెంకీని అడిగాడు దర్శకుడు అనిల్. ప్రారంభంలోనే ఓ కంఫర్ట్​ వచ్చేసిందని వెంకీ చెప్పాడు.

మహేశ్ బాబు

"సినిమా షూటింగ్​ కోసం ఔట్ డోర్​కు వెళ్లాం. అక్కడ హోటల్​ కూడా ఓ గెస్ట్ హౌస్​లా ఉంది. ముందు నేను వెళ్లా. తర్వాత వెంకీ సార్ వచ్చారు. తర్వాత రోజే షూటింగ్. అందరం కాఫీ తాగుతున్నాం. నీతో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉందని ఓ హగ్ ఇచ్చారు." - మహేశ్ బాబు

జనవరి 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'సరిలేరు నీకెవ్వరు' చిత్రం ఘనవిజయాన్ని అందుకుంది. రష్మిక మందణ్న హీరోయిన్​గా నటించిన ఈ సినిమాలో విజయశాంతి కీలక పాత్ర పోషించింది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించాడు.

ఇదీ చదవండి: అదర చుంబనం కోసం.. అల్లాడింది..!

ABOUT THE AUTHOR

...view details