తెలంగాణ

telangana

By

Published : Feb 24, 2020, 4:25 PM IST

Updated : Mar 2, 2020, 10:01 AM IST

ETV Bharat / sitara

ఆ మూడు రోజులు 24x7 నాన్​స్టాప్​ షోలు

'సూర్యవంశీ' సినిమాను ముంబయిలో మూడు రోజుల పాటు 24x7 ప్రదర్శించనున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం ఇందుకు అనుమితిచ్చింది. ఈ ప్లాన్​ వల్లే చిత్ర రిలీజ్​ డేట్​ మార్చినట్లు దర్శకుడు రోహిత్​శెట్టి వెల్లడించాడు.

'Sooryavanshi' to release on March 24, to be screened 24x7 in Mumbai theatres
'సూర్యవంశీ' సినిమా విడుదల తేది మార్పు

బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటిస్తున్న 'సూర్యవంశీ' విడుదల తేదీ ముందుకు జరిగింది. మార్చి 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనితో పాటే ఓ సరికొత్త ప్లాన్​తో ముందుకు వస్తోంది చిత్రబృందం. ముంబయిలో ఈ చిత్రాన్ని రిలీజ్​ నుంచి మూడు రోజుల పాటు 24x7 ప్రదర్శించనున్నారు. ఈ మేరకు మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ విషయాన్నే చెబుతూ ఇన్​స్టాలో ఓ వీడియోను పోస్ట్ చేశాడు దర్శకుడు రోహిత్ శెట్టి.

మూడు రోజులపాటు ప్రత్యేక ప్రదర్శనలు

ఈ వీడియోలో కొందరు పిల్లలు, రణ్​వీర్​ సింగ్​ దగ్గరకు వచ్చి నిద్రలేపి మరీ ఈ విషయాన్ని చెబుతారు. అజయ్ దేవగణ్​కూ ఇదే విషయం చెబుతారు. హీరో అక్షయ్​కూ ఈ విషయమే చూపిస్తారు. చివరగా పిల్లలందరూ పాప్​కార్న్​ డబ్బాలు పట్టుకొని థియేటర్​కు వెళుతూ కనిపిస్తుంటారు.

భారతదేశ తొలి పోలీస్​(కాప్) యూనివర్స్​​ 'సూర్యవంశీ'. ఇందులో కత్రినాకైఫ్ హీరోయిన్​గా నటిస్తోంది. ఇందులో రణ్​వీర్ సింగ్, అజయ్ దేవగణ్​ ప్రత్యేక పాత్రలు పోషిస్తున్నారు.

ఇదీ చూడండి..'ఇప్పటికీ శుక్రవారం అంటే నాకు భయమే'

Last Updated : Mar 2, 2020, 10:01 AM IST

ABOUT THE AUTHOR

...view details