తెలంగాణ

telangana

By

Published : Jul 13, 2020, 1:56 PM IST

ETV Bharat / sitara

400 పేద కుటుంబాలకు అండగా సోనూసూద్

కరోనాతో ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటున్న 400 పేద కుటుంబాలను ఆదుకునేందుకు సిద్ధమయ్యారు నటుడు సోనూసూద్. ఇప్పటికే పలు రాష్ట్రాల అధికారులతో మాట్లాడి వారి చిరునామాలు, బ్యాంకు ఖాతాలను సేకరిస్తున్నారు.

Sonu Sood
సోనూసూద్

లాక్​డౌన్​ ప్రారంభమైనప్పటి నుంచి వలస కార్మికుల క్షేమం కోసం నిరంతరంగా కృషి చేస్తున్నారు బాలీవుడ్​ నటుడు సోనూసూద్​. ఇప్పుడు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న 400 పేద కుటంబాలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు​. ముఖ్యంగా వలసకార్మికులను ఆదుకుంటానని తెలిపారు.

ఉత్తరప్రదేశ్​, బిహార్​, ఝార్ఖండ్​ సహా మిగతా రాష్ట్రాల అధికారులతో సంప్రదించి వారి నుంచి వలస కార్మికుల చిరునామాలు, బ్యాంక్​ ఖాతాల వివరాలు సేకరించే ప్రక్రియలో ఉన్నారు సోనూ.

ఇప్పటికే వేలాది మంది కూలీలను ప్రత్యేక బస్సుల ద్వారా వారి స్వరాష్ట్రాలకు తరలిస్తున్నారు సోనూసూద్​. గతనెల ఏకంగా ఓ విమానం ద్వారా 300మంది కూలీలను వారి ఇళ్లకు చేర్చారు.

ఇది చూడండి : 'పెళ్లికి ఇదే సరైన సమయం.. ఖర్చు అక్కర్లేదు'

ABOUT THE AUTHOR

...view details