అడివి శేష్ ప్రధాన పాత్రలో నటించిన 'గూఢచారి' చిత్రంతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన నటి శోభితా దూళిపాళ. ఇటీవల ఆమె ఓ మ్యాగజైన్ కోసం ఫొటోషూట్లో పాల్గొంది. "లాక్డౌన్ కారణంగా మా ఇంటి దగ్గరే ఈ ఫొటోషూట్ చేసుకున్నాను. నాకు నేనే మేకప్ వేసుకుని, సెల్ఫ్ టైమర్తో స్వయంగా నేనే ఫొటోలు తీసుకున్నా." అని శోభిత పేర్కొంది. అయితే ఈ ఫొటోలు బయటకు రావడం వల్ల అందులోని ఓ ఫొటోలో ఆమెను మరో వ్యక్తి ఫొటో తీస్తున్నట్లు ఉంది. దీంతో నెటిజన్లు ఆమెపై విమర్శలు చేయడం ప్రారంభించారు. "శోభిత అబద్ధం చెప్పింది. సెల్ఫ్ టైమర్ పెట్టి ఫొటోషూట్ చేస్తే ఈ ఫొటోగ్రాఫర్ ఏం చేస్తున్నాడు" అంటూ విపరీతంగా కామెంట్లు పెట్టారు.
తాజాగా దీనిపై శోభిత వివరణ ఇచ్చింది. "నెటిజన్ల ట్రోలింగ్ గురించి విని ఎంతో బాధపడ్డాను. పూర్తి విషయం తెలుసుకోకుండా ఓ నిర్ణయానికి ఎలా వస్తారో అనిపించింది. దీనివల్ల నేను ఒక విలువైన పాఠం నేర్చుకున్నా. నా ఫొటోషూట్ ఎలా జరిగిందో మీకు చెప్పాలని భావిస్తున్నా.
1. ఫొటోషూట్ కోసం రెడీ అయ్యాక.. ఓ కాఫీ కప్పు, నా ఫోన్తో ఫొటోషూట్ తీయడానికి మా టెర్రస్ పైకి వెళ్లాను.