స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్.. జయలలిత బయోపిక్ 'తలైవి' షూటింగ్ పూర్తి చేసింది. శనివారం సాయంత్రం ట్వీట్ చేసిన ఆమె.. చిత్రబృందానికి ధన్యవాదాలు తెలిపింది.
ఈ సినిమాలో అరవింద్ స్వామి ఎమ్జీఆర్గా, ప్రకాశ్రాజ్ కరుణానిధి పాత్రల్లో కనిపించనున్నారు. ఏఎల్ విజయ్ దర్శకత్వం వహించారు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో త్వరలో విడుదల కానుంది.
ప్రముఖ నేపథ్య గాయకుడు మను.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో పాల్గొన్నారు. సంగీత దర్శకుడు కోటి విసిరిన హరిత సవాల్ను స్వీకరించిన.. గచ్చిబౌలిలోని తన నివాసంలో మొక్కలు నాటారు.
మనిషి ఆయువు ఉండాలంటే ప్రాణవాయువు కావాలని, అందుకోసం ప్రతి ఒక్కరు బాధ్యతగా మొక్కలు నాటాలని అన్నారు. సింగర్స్ చిత్ర, సుజాత, శ్వేతా మోహన్ లు మొక్కలు నాటాలని హరిత సవాల్ విసిరారు.
గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో సింగర్ మను