నటీనటులు పాత్రల కోసం తమ శరీర బరువులను పెంచడం, తగ్గించడం చేస్తుంటారు. తాజాగా 'వెందు తనిందుడు కాడు' సినిమా కోసం తమిళ నటుడు శింబు ఏకంగా 30 కేజీల బరువు తగ్గి సన్నగా రెడీ అయ్యాడు.
బరువు తగ్గిన శింబు.. వైరల్గా మారిన ఫొటోలు - శింబు మూవీలు
తమిళ నటుడు శింబు సన్నగా మారిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. 'వెందు తనిందుడు కాడు' సినిమా కోసం దాదాపు 30 కేజీల బరువు తగ్గి అందర్నీ ఆశ్చర్యపరిచాడీ హీరో.
శింబు హీరోగా గౌతమ్ మేనన్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా విడుదలైంది. ఇందులో శింబు లుంగీ ధరించి, కర్రపట్టుకుని కనిపించాడు. ఇది చూసి అందరూ షాకయ్యారు. తాజాగా శింబు తన సోషల్ మీడియాలో స్లిమ్ లుక్లోకి మారిన ఫొటోలు షేర్ చేశాడు. ఇందులో క్లీన్ షేవ్తో కనిపిస్తున్నాడు. దీంతో అభిమానుల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ చిత్రానికి ఎ.ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా.. వెల్స్ ఇంటర్నేషనల్ పతాకంపై డా. ఇషారీ కె.గణేష్ నిర్మిస్తున్నారు.
ఇదీ చదవండి:అందుకే తెలుగులో గ్యాప్ వచ్చింది: మేఘ