పవర్స్టార్ పవన్కల్యాణ్ రీఎంట్రీ ఇస్తున్న సినిమా 'వకీల్సాబ్'. ఇందులో పవన్ సరసన హీరోయిన్గా శ్రుతిహాసన్ నటిస్తుందంటూ ఈ మధ్య కాలంలో వార్తలు వచ్చాయి. తాజాగా దీనిపై స్పందించిన ఈ ముద్దుగుమ్మ.. తాను ఇందులో నటించట్లేదని స్పష్టం చేసింది.
హిందీలో విజయవంతమైన 'పింక్'కు రీమేక్ ఈ సినిమా తీస్తున్నారు. అంజలి, నివేదా థామస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతమందిస్తున్నాడు. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే వచ్చిన 'మగువా మగువా' శ్రోతల్ని అలరిస్తోంది.