తెలంగాణ

telangana

ETV Bharat / sitara

టాలీవుడ్​ రీఎంట్రీపై శ్రుతి ఆసక్తికర వ్యాఖ్యలు - telugu tollywood latest news

హీరోయిన్​ శ్రుతిహాసన్..​ టాలీవుడ్​ పునరాగమనంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తెలుగు చిత్రసీమ తనకు రెండో ఇళ్లులాంటిదని చెప్పింది. రవితేజ సరసన ప్రస్తుతం 'క్రాక్'లో కథానాయికగా నటిస్తోంది.

టాలీవుడ్​ రీఎంట్రీపై శ్రుతి ఆసక్తికర వ్యాఖ్యలు

By

Published : Nov 16, 2019, 10:38 AM IST

హీరోయిన్​ శ్రుతిహాసన్​.. దాదాపు రెండేళ్ల విరామం తర్వాత తెలుగు సినిమాలో హీరోయిన్​గా నటిస్తోంది. చివరగా 'కాటమరాయుడు'లో కనిపించిన ఈ ముద్దుగుమ్మ... రవితేజ కొత్త చిత్రం 'క్రాక్'​లో అవకాశం దక్కించుకుంది. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఈ భామ.. పలు ఆసక్తికర విషయాలు చెప్పింది.

"టాలీవుడ్​లో తిరిగి నటిస్తుండటం చాలా ఆనందంగా ఉంది. నేను తమిళ ​అమ్మాయిని అయినా, తెలుగు సినిమాలంటే ఎంతో ఇష్టం. హీరోయిన్​గా నా సినీ ప్రయాణం తెలుగులోనే మొదలైంది. టాలీవుడ్ నాకు రెండో ఇళ్లులాంటిది"

-శ్రుతిహాసన్, హీరోయిన్

'క్రాక్​'లో సముద్రఖని, బాబీ సింహా కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతమందిస్తున్నాడు. గోపీచంద్ మలినేని దర్శకుడు. బి.మధు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవికి ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

తమిళంలో విజయ్​ సేతుపతి నటిస్తున్న 'లాభం'లో హీరోయిన్​గానూ శ్రుతి నటిస్తోంది. డిస్నీ తెరకెక్కించిన 'ఫ్రోజెన్​ 2' చిత్రంలో ఎల్సా పాత్రకు గాత్రం అందించింది. త్వరలో విడుదల కానుందీ సినిమా.

ఇదీ చదవండిః నేడు గవర్నర్​తో శివసేన-ఎన్​సీపీ-కాంగ్రెస్​ భేటీ

ABOUT THE AUTHOR

...view details