తెలంగాణ

telangana

ETV Bharat / sitara

చై-సాయి పల్లవి 'లవ్​స్టోరీ' ముగిసింది.. - by Narayan Das K Narang

అక్కినేని వారసుడు నాగచైతన్య, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం 'లవ్​స్టోరీ'. తాజాగా ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.

LoveStory
చై-సాయి పల్లవి లవ్​స్టోరీకి శుభంకార్డు..?

By

Published : Nov 18, 2020, 1:54 PM IST

అక్కినేని హీరో నాగచైతన్య, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న రొమాంటిక్ చిత్రం 'లవ్‌స్టోరీ'. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతోంది. కరోనా వైరస్ ముందే సినిమా చిత్రీకరణ చాలా వరకు పూర్తి చేసుకుంది. లాక్‌డౌన్ నిబంధనల ప్రకారం సెప్టెంబర్​ 7న షూటింగ్​ పునః ప్రారంభించారు. తాజాగా చిత్రీకరణ పూర్తయినట్లు చిత్రయూనిట్​ వెల్లడించింది. దర్శకుడు శేఖర్​ కమ్ముల, నటి సాయిపల్లవి, శేఖర్​ మాస్టర్​ కలిసి తీసుకున్న చిత్రాన్ని పోస్టు చేసింది.

చిత్రీకరణ అనంతరం సాయి పల్లవి, శేఖర్​ కమ్ముల, శేఖర్​ మాస్టర్​

ఈ ఏడాది చివర్లోపు సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు కసరత్తులు చేస్తున్నారు దర్శక నిర్మాతలు.

ABOUT THE AUTHOR

...view details