తెలంగాణ

telangana

ETV Bharat / sitara

షూటింగ్​ యుద్ధభూమిలా అనిపిస్తోంది: అదాశర్మ - తొలి సారి షూటింగ్​లో అడుగుపెట్టిన ఆదాశర్మ

లాక్​డౌన్​ తర్వాత తొలిసారి సెట్​లో అడుగుపెట్టిన నటి అదాశర్మ.. షూటింగ్​కు వెళ్తుంటే యుద్ధానికి సన్నద్ధమవుతున్నట్లు అనిపించిందని రాసుకొచ్చింది.

asah sharma
ఆదాశర్మ

By

Published : Jun 25, 2020, 11:52 AM IST

లాక్​డౌన్​ సడలింపులు ఇచ్చిన నేపథ్యంలో నటి అదాశర్మ.. తిరిగి షూటింగ్​ పాల్గొంది. ఆ అనుభవాన్ని పంచుకుంది. చిత్రీకరణకు వెళ్తుంటే యుద్ధానికి పోతున్నట్లుగా ఉందనని వెల్లడించింది. ఇటీవలే ఓ కాఫీ కంపెనీ యాడ్​లో నటించినట్లు పేర్కొంది. ఆ ఫొటోను ట్విట్టర్​లో పోస్ట్​ చేసింది.

"లాక్​డౌన్​ సడలింపులు ఇచ్చిన తర్వాత మళ్లీ సెట్​లో తొలిసారి అడుగుపెట్టాను. ఓ కాఫీ కంపెనీ యాడ్ చిత్రీకరణలో అన్ని జాగ్రత్తలు పాటిస్తూ పాల్గొన్నా. సెట్​లో 20 మందికి కంటే తక్కువుగా ఉండేలా చూసుకుని.. అంతటా శానిటైజ్​ చేశాం. మాస్కులు ధరించాం. ఇదంతా చూస్తుంటే ఓ సమరానికి వెళ్తున్నట్లుగా అనిపించింది. ఎందుకంటే మనమంతా కరోనాతో పోరాడాలి కదా"

-అదాశర్మ, ప్రముఖ నటి

పుస్తకాలు చదవడం, పక్షులు లాగా మిమిక్రీ చేయడం సహా ఇతరత్ర వ్యాపకాలతో లాక్​డౌన్​ను గడిపినట్లు తెలిపింది అదాశర్మ. త్వరలో 'మ్యాన్​ టు మ్యాన్'​ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుందీ భామ.

ఇది చూడండి : నామాజీ ప్రియుడు ఇంకా అద్దె ఇంట్లోనే: కంగనా

ABOUT THE AUTHOR

...view details