తెలంగాణ

telangana

ETV Bharat / sitara

జయ బయోపిక్​లో శోభన్ బాబు కనిపిస్తారా..?

దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్​ 'తలైవి'లో శోభన్ బాబు పాత్ర గురించి సర్వత్రా చర్చ నడుస్తోంది. ఇందులో అందాల నటుడి పాత్రను అతిథి పాత్రలా చూపించే ఆలోచనలో ఉన్నాడట దర్శకుడు.

By

Published : Nov 2, 2019, 5:52 PM IST

Updated : Nov 2, 2019, 8:40 PM IST

కంగనా రనౌత్​

దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత జీవితకథ ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రం 'తలైవి'. బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటిస్తోంది. తాజాగా ఇందులో శోభన్ బాబు పాత్ర గురించే చర్చ నడుస్తోంది. గతంలో జయలలిత - శోభన్ బాబు ప్రేమించుకున్నారనే వార్తలే వీటికి కారణం.

అప్పట్లో ఈ అందాల నటుడితో జయ ప్రేమలో ఉన్నట్లు.. ఒకానొక దశలో ఇద్దరూ పెళ్లి కూడా చేసుకున్నట్లు రకరకాల వార్తలొచ్చాయి. కాబట్టి ఇప్పుడీ జీవిత కథలో శోభన్‌బాబు పాత్రను చూపిస్తారా? లేదా? అన్నది కీలకంగా మారింది. ఒకవేళ వీరి ప్రేమ కథ గురించి ఇందులో చూపిస్తే జయ అభిమానుల నుంచి వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశముంది. ఈ హీరో పాత్ర తీసేస్తే కథలో వాస్తవికత దెబ్బతింటుంది.

శోభన్​ బాబు - జయలలిత

ఈ అంశంపై దర్శకుడు ఎఎల్ విజయ్ ఎటూ తేల్చుకోలేకపోతున్నాడట. శోభన్‌బాబు పాత్రను అతిథి పాత్రలా చూపిస్తే సరిపోతుందేమోనన్న ఆలోచన కూడా ఉందట. సినిమాలో ఆయన ఎపిసోడ్‌ను కొంత వరకే పరిమితం చేయాలని తుది నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే శోభన్‌బాబు పాత్రలో కనిపించబోయే నటుడెవరన్నది ఆసక్తికరంగా మారనుంది.

ప్రముఖ సినీ రచయిత విజయేంద్రప్రసాద్‌ ఈ చిత్రానికి కథ అందిస్తున్నాడు. ఎం.జి.ఆర్‌గా అరవింద స్వామి, కరుణానిధిగా ప్రకాష్‌రాజ్‌ కనిపించనున్నారు.

ఇదీ చదవండి: సల్మాన్ వల్ల నా కోరిక తీరింది: దిశా పటానీ

Last Updated : Nov 2, 2019, 8:40 PM IST

ABOUT THE AUTHOR

...view details