తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఆ చిత్రాన్ని తెరకెక్కించి సుశాంత్​కు అంకితమిస్తా' - పానీ చిత్రాన్ని సుశాంత్​కు అంకితం

బాలీవుడ్​ నటుడు సుశాంత్​ సింగ్​ నటించాల్సిన 'పానీ' చిత్రాన్ని ఎప్పటికైనా తెరకెక్కిస్తాని ప్రతిజ్ఞ చేశాడు దర్శకుడు శేఖర్​ కపూర్​. ఈ సినిమాను అతడి జ్ఞాపకార్థంగా అంకితమిస్తానని తెలిపాడు.

sushanth
సుశాంత్​

By

Published : Jul 22, 2020, 5:56 PM IST

బాలీవుడ్​ నటుడు సుశాంత్​​ సింగ్​ రాజ్​పుత్ డ్రీమ్​ ప్రాజెక్ట్​ 'పానీ' సినిమాను ఎప్పటికైనా తెరకెక్కిస్తానని ప్రతిజ్ఞ బూనాడు దర్శకుడు శేఖర్​కపూర్​. ఆ చిత్రాన్ని ఈ నటుడి జ్ఞాపకార్థంగా అతడికి అంకితమిస్తానని అన్నాడు. అయితే దీన్ని మానవత్వం సహా చక్కని సద్గుణాలు ఉన్న వ్యక్తి భాగస్వామ్యంతో రూపొందిస్తానని తెలిపాడు.

ఈ ట్వీట్​పై నెటిజన్లు విపరీతంగా స్పందిస్తున్నారు. శేఖర్​ కపూర్​కు మద్దతుగా నిలుస్తున్నారు. ఈ చిత్రాన్ని నిర్మించడానికి నిర్మాతలు ముందుకు రాకపోతే క్రౌడ్​ ఫండింగ్​ ద్వారా నిర్మించాలని సూచిస్తున్నారు.

'పానీ' చిత్రాన్ని యశ్​రాజ్​ ఫిలింస్ సంస్థ​ నిర్మించాల్సి ఉండగా.. శేఖర్​ కపూర్​ దర్శకత్వం వహించాల్సింది. అయితే నిర్మాత ఆదిత్యా చోప్రా.. సుశాంత్​ మధ్య భేదాభిప్రాయాల వల్ల ఈ చిత్రం ఆగిపోయిందని సమాచారం.

ఇది చూడండి : పోలీసుల ధైర్య సాహసాలకు సెల్యూట్: అజయ్

ABOUT THE AUTHOR

...view details