బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ డ్రీమ్ ప్రాజెక్ట్ 'పానీ' సినిమాను ఎప్పటికైనా తెరకెక్కిస్తానని ప్రతిజ్ఞ బూనాడు దర్శకుడు శేఖర్కపూర్. ఆ చిత్రాన్ని ఈ నటుడి జ్ఞాపకార్థంగా అతడికి అంకితమిస్తానని అన్నాడు. అయితే దీన్ని మానవత్వం సహా చక్కని సద్గుణాలు ఉన్న వ్యక్తి భాగస్వామ్యంతో రూపొందిస్తానని తెలిపాడు.
ఈ ట్వీట్పై నెటిజన్లు విపరీతంగా స్పందిస్తున్నారు. శేఖర్ కపూర్కు మద్దతుగా నిలుస్తున్నారు. ఈ చిత్రాన్ని నిర్మించడానికి నిర్మాతలు ముందుకు రాకపోతే క్రౌడ్ ఫండింగ్ ద్వారా నిర్మించాలని సూచిస్తున్నారు.