తెలంగాణ

telangana

ETV Bharat / sitara

శర్వానంద్ 'శ్రీకారం' కూడా ఓటీటీలోనే!

దేశంలోని థియేటర్లు ఇప్పట్లో తెరిచేలా కనిపించడం లేదు. దీంతో సినిమాలు ఓటీటీ బాటపడుతున్నాయి. ఇప్పుడు శర్వానంద్ 'శ్రీకారం' చిత్రాన్ని ఇందులో తీసుకురావాలని భావిస్తున్నారు.

By

Published : Sep 21, 2020, 10:33 PM IST

Sharwanand 'Sreekaram' all set for direct OTT release?
శర్వానంద్ 'శ్రీకారం'

మరో టాలీవుడ్​ సినిమా ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. యువకథానాయకుడు శర్వానంద్ నటించిన 'శ్రీకారం' త్వరలో డిజిటల్​ వేదికగా విడుదల చేయనున్నారట. ఇందులో శర్వా రైతుగా కనిపించనున్నారు. ప్రియాంక మోహన్ హీరోయిన్. సాయికుమార్‌, మురళి శర్మ, రావు రమేష్‌, ఆమని, సప్తగిరి ఇతర పాత్రల్లో కనిపించనున్నారు.

కొంతభాగం షూటింగ్​ను అక్టోబరులో పూర్తి చేసి నవంబరు చివర్లో ప్రేక్షకులు ముందు సినిమాను తీసుకురావాలని చిత్రబృందం భావిస్తోంది. కిశోర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతమందించారు. 14 రీల్స్ ఎంటర్​టైన్​మెంట్స్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details