తెలంగాణ

telangana

ETV Bharat / sitara

తుది దశకు చేరుకున్న సాహో చిత్రీకరణ

'సాహో' చిత్రం ప్రస్తుతం ఆస్ట్రియాలో షూటింగ్ జరుపుకుంటోంది. ఇందుకు సంబంధించిన ఓ ఫొటోను తన ఇన్ స్టాలో పంచుకున్నాడు ప్రభాస్. ఆగస్టు 15న సినిమా విడుదల కానుంది.

By

Published : Jul 2, 2019, 7:50 PM IST

సాహో

ప్రభాస్ నటిస్తున్న సాహో చిత్ర షూటింగ్ తుది దశలు చేరుకుంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ ఆస్ట్రియాలో జరపుకుంటోంది. తాజాగా ఇందుకు సంబంధించిన ఫొటోను తన ఇన్ స్టాలో పంచుకున్నాడు మన డార్లింగ్. ఆగస్టు 15న సాహో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

"హాయ్ డార్లింగ్స్​.. ఆస్ట్రియాలో సాహో షూటింగ్ జరుగుతోంది. అద్భుతంగా ఉంది. ఇంత వరకు చూడని అనుభూతులను కలిగిస్తోంది" అంటూ తన ఇన్ స్టాగ్రామ్​లో పంచుకున్నాడు రెబల్ స్టార్.

సాహో సినిమాలో ఇంకా రెండు పాటలు చిత్రీకరించాల్సి ఉంది. భారీ బడ్జెట్​తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన సాహో చిత్ర టీజర్​కు మంచి స్పందన వస్తోంది. శ్రద్ధాకపూర్ హీరోయిన్​గా నటిస్తోంది.

ఇది చదవండి: ఇ'స్మార్ట్'​గా షూటింగ్ పూర్తిచేసుకున్న శంకర్

ABOUT THE AUTHOR

...view details