తెలంగాణ

telangana

By

Published : Jan 3, 2020, 8:25 AM IST

Updated : Jan 3, 2020, 2:18 PM IST

ETV Bharat / sitara

'సరిలేరు నీకెవ్వరు' సెన్సార్ టాక్ ఏంటంటే?

మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా తాజాగా సెన్సార్ పూర్తి చేసుకుంది.

sarileru
సరిలేరు నీకెవ్వరు

బాక్సాఫీస్‌ బరిలో పోటీ పడేందుకు అటు అల్లు అర్జున్‌ 'అల.. వైకుంఠపురములో' చిత్రంతో.. ఇటు మహేష్‌బాబు 'సరిలేరు నీకెవ్వరు'తో సిద్ధమైపోయారు. ఇప్పటికే ఈ రెండు చిత్రాలు ప్రచార పర్వాన్ని జోరుగా పరుగులు పెట్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మహేష్‌.. బన్నీ కన్నా ముందుగా సెన్సార్‌ పనులను పూర్తి చేసేసుకున్నాడు. తాజాగా ఈ చిత్రాన్ని వీక్షించిన సెన్సార్‌ బోర్డు ఎలాంటి కట్స్‌ లేకుండా దీనికి 'యూ-ఏ' సర్టిఫికెట్‌ను జారీ చేసింది.

సరిలేరు నీకెవ్వరు

సినిమాలో ఆర్మీ మేజర్‌గా మహేష్‌ ఎపిసోడ్‌ ఆయన అభిమానులకు కనులవిందులా ఉంటుందట. ఇక ఈ చిత్రంలో ప్రిన్స్ కామెడీ టైమింగ్‌ అదిరిపోయేలా ఉంటుందని తెలుస్తోంది. విజయశాంతి - మహేష్‌ల మధ్య వచ్చే సన్నివేశాలు ప్రతిఒక్కరినీ కట్టిపడేస్తాయని సమాచారం.

ఇప్పటికే చిత్ర టీజర్‌కు, పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కిన నేపథ్యంలో సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా ఒక్కరోజు ముందుగానే విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోన్నట్లు తెలుస్తోంది.

ఇవీ చూడండి.. పదేళ్ల తర్వాత మహేశ్​ సినిమాకు మణిశర్మ!

Last Updated : Jan 3, 2020, 2:18 PM IST

ABOUT THE AUTHOR

...view details