తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'సరిలేరు నీకెవ్వరు' వచ్చేది ఆరోజే​

టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు హీరోగా నటిస్తోన్న 'సరిలేరు నీకెవ్వరు' సినిమా విడుదల తేదీ ఖరారైంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

By

Published : Oct 12, 2019, 11:03 PM IST

సరిలేరు

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటిస్తోన్న చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'. అనిల్ రావిపూడి దర్శకుడు. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని మొదటి నుంచి చెప్పిన చిత్రబృందం తాజాగా విడుదల తేదీని ఖరారు చేసింది.

ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు చిత్రబృందం స్పష్టం చేసింది. ఇదే తేదీన అల్లు అర్జున్ నటించిన 'అల వైకుంఠపురములో' సినిమా విడుదల కానుంది. ఈ చిత్రం విడుదల తేదీ ఖరారు చేసిన గంట వ్యవధిలోనే 'సరిలేరు నీకెవ్వరు' తేదీని ప్రకటించడం విశేషం.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మహేశ్ ఆర్మీ అధికారి అజయ్ కృష్ణగా కనిపించనున్నాడు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో విజయ శాంతి ఓ కీలక పాత్రలో కనపించనుంది.

ఇవీ చూడండి.. 'అల వైకుంఠపురములో' విడుదల తేదీ ఖరారు

ABOUT THE AUTHOR

...view details