తెలంగాణ

telangana

By

Published : Nov 22, 2019, 5:06 PM IST

Updated : Nov 22, 2019, 5:26 PM IST

ETV Bharat / sitara

'సరిలేరు నీకెవ్వరు': డైలాగ్స్​తో రెచ్చిపోతున్న ప్రిన్స్​

టాలీవుడ్​ సూపర్​స్టార్​ మహేశ్​బాబు సినిమా నుంచి మరో సర్​ప్రైజ్​ వచ్చేసింది. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'సరిలేరు నీకెవ్వరు' టీజర్ నేడు​ విడుదలైంది. అంతేకాకుండా విడుదల తేదీపైనా క్లారిటీ ఇచ్చింది చిత్రబృందం.

'సరిలేరు నీకెవ్వరు' టీజర్ వచ్చేసింది...!

మహేశ్​బాబు నటిస్తోన్న 'సరిలేరు నీకెవ్వరు' సినిమా టీజర్​ను... తాజాగా విడుదల చేసింది చిత్రబృందం. ఇందులో సూపర్​స్టార్..​ మేజర్​ అజయ్​ కృష్ణగా నటించాడు. ప్రిన్స్​ సరసన రష్మిక మందన్న కథానాయికగా ఆకట్టుకోనుంది. లేడీ అమితాబ్​ విజయశాంతి కీలకపాత్ర పోషిస్తోంది.

" మీరెవరో మాకు తెలియదు... మీకూ మాకు ఏ రక్తసంబంధం లేదు. కానీ మీ కోసం, మీ పిల్లల కోసం పగలు-రాత్రి, ఎండా-వానా అనే తేడా లేకుండా పోరాడుతూనే ఉంటాం. ఎందుకంటే మీరు మా బాధ్యత" అని అజయ్​ కృష్ణగా మహేశ్​ చెప్పిన డైలాగ్​తో టీజర్​ మొదలైంది.

"భయపడే వాడే బేరానికి వస్తాడు.. మన దగ్గర బేరాల్లేవమ్మా"అని ప్రిన్స్​... "గాయం విలువ తెలిసినవాడే సాయం చేస్తాడు బాబాయ్" అని విజయశాంతి..."ప్రతి సంక్రాంతికి అల్లుళ్లొస్తారు... ఈ సంక్రాంతికి మొగుడొచ్చాడు" అంటూ ప్రకాశ్​రాజ్​ చెప్పిన డైలాగ్స్​తో టీజర్​ ఆసక్తికరంగా రూపొందించారు. ఈ నిముషంన్నర వీడియో చూశాక చిత్రంపై మరింత అంచనాలు పెరిగే అవకాశముంది.

ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ కేరళలోని అంగామలై అటవీ ప్రాంతంలో జరుగుతోంది. నవంబర్‌ 22 వరకు ఈ షెడ్యూల్‌ కొనసాగుతుంది. అనంతరం నవంబర్‌ 25 నుంచి హైదరాబాద్‌లో తదుపరి షూటింగ్​ జరగనుంది. దిల్‌రాజు, రామబ్రహ్మం, మహేశ్‌బాబు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. దేవిశ్రీ స్వరాలు సమకూర్చాడు.

విడుదల తేదీ మార్పు...

సంక్రాంతి పండుగ సందర్భంగా వచ్చే ఏడాది జనవరి 12న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం నిర్ణయించుకుంది. అయితే అదే రోజు అల్లు అర్జున్‌ 'అల.. వైకుంఠపురములో..' విడుదల చేయాలని ఆ చిత్ర నిర్మాతలు భావించారు. ఒకే రోజు రెండు సినిమాలు విడుదలవడం వల్ల బాక్సాఫీస్‌ వద్ద పోటీ నెలకొంటుందని.... ఇందువల్ల ఇరు చిత్రాల నిర్మాతలకు నష్టం కలుగుతుందని తెలుగు చిత్ర నిర్మాతల సంఘంలో ఈ విషయంపై చర్చించారు. ఫలితంగా రెండు సినిమా నిర్మాతలు అనిల్‌ సుంకర, చినబాబు తేదీల మార్పునకు అంగీకరించారు. 'సరిలేరు నీకెవ్వరు' జనవరి 11న, 'అల.. వైకుంఠపురములో..' జనవరి 12న విడుదల కానున్నట్లు ప్రకటించారు.

Last Updated : Nov 22, 2019, 5:26 PM IST

ABOUT THE AUTHOR

...view details