తెలంగాణ

telangana

By

Published : Dec 18, 2019, 7:39 PM IST

ETV Bharat / sitara

ఈ సంక్రాంతి.. మీకు మర్చిపోలేని ఓ జ్ఞాపకమవుతుంది

స్టార్ హీరో మహేశ్​బాబు 'సరిలేరు నీకెవ్వరు' చిత్రీకరణ పూర్తయింది. ఈ విషయాన్ని చిత్రబృందం వెల్లడించింది. సంక్రాంతి కానుకగా రానుందీ సినిమా.

ఈ సంక్రాంతి.. మీరు ఓ మర్చిపోలేని జ్ఞాపకమవుతుంది
'సరిలేరు నీకెవ్వరు' చిత్రీకరణ పూర్తి

సూపర్​స్టార్ మహేశ్​బాబు నటిస్తున్న 'సరిలేరు నీకెవ్వరు' షూటింగ్​ పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని దర్శకుడు అనిల్ రావిపూడి ట్వీట్ చేశాడు. రానున్న సంక్రాంతి పండగ.. సినీ ప్రేమికులకు, ప్రిన్స్​ అభిమానులకు మర్చిపోలేనిఓ జ్ఞాపకమవుతుందని ట్విట్టర్​లో రాసుకొచ్చాడు.

దర్శకుడు అనిల్ రావిపూడి ట్వీట్

ఈ చిత్రంలో మహేశ్​.. మేజర్ అజయ్​కృష్ణగా కనిపించనున్నాడు. రష్మిక హీరోయిన్. ప్రకాశ్​రాజ్​, విజయశాంతి, రాజేంద్ర ప్రసాద్, సంగీత తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతమందించాడు. అనిల్ సుంకర్-దిల్​రాజు-మహేశ్​బాబు సంయుక్తంగా నిర్మించారు. వచ్చే నెల 11న థియేటర్లలోకి రానుందీ సినిమా.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details