తెలంగాణ

telangana

By

Published : Sep 11, 2020, 8:55 PM IST

Updated : Sep 11, 2020, 9:04 PM IST

ETV Bharat / sitara

డ్రగ్​ కేసు: రాగిణి బెయిల్​ విచారణ వాయిదా

శాండిల్​వుడ్​ డ్రగ్స్ కేసులో అరెస్టయిన కన్నడ నటి రాగిణి బెయిల్​ విచారణ సెప్టెంబరు 14కు వాయిదా పడింది. గత శుక్రవారం సెంట్రల్​ క్రైమ్ బ్రాంచ్​(సీసీబీ) రాగిణిని అరెస్టు చేసింది.

Ragini
రాగిణి

మాదక ద్రవ్యాల వినియోగం ఆరోపణలపై అరెస్టయిన నటి రాగిణి ద్వివేది బెయిల్​ విచారణ వాయిదా పడింది. గత శుక్రవారం సెంట్రల్​ క్రైమ్ బ్రాంచ్​(సీసీబీ) రాగిణిని అరెస్టు చేసింది. ఈ క్రమంలోనే రాగిణి దాఖలు చేసిన బెయిల్​ పిటిషన్​పై.. శుక్రవారం(సెప్టెంబరు11)న విచారణ జరగాల్సి ఉంది. అయితే, ఎన్​డీపీఎస్​ ప్రత్యేక న్యాయస్థానం వచ్చే సోమవారం(సెప్టెంబరు 14)కు ఈ విచారణను వాయిదా వేసింది. మరోవైపు సీసీబీ అధికారులు దర్యాప్తు ఇంకా పూర్తి కాలేదని తెలిపారు.

రాగిణి, సంజనలకు డోపింగ్ టెస్టులో భాగంగా వారి రక్త నమూనాలను తీసుకున్నారు అధికారులు. వాటిని ఫోరెన్సిక్​ ల్యాబొరేటరీకి పంపించనున్నారు.

Last Updated : Sep 11, 2020, 9:04 PM IST

ABOUT THE AUTHOR

...view details