లాక్డౌన్ ప్రారంభం నుంచి బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ఖాన్, ముంబయికి దూరంగా ఉన్న తన వ్యవసాయ క్షేత్రంలోనే ఉంటున్నారు. తాజాగా ప్రపంచ ప్రపంచ పర్యావరణ దినోత్సవం(జున్ 5) సందర్భంగా ఇన్స్టాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు. నిసర్గ తుఫాను ప్రభావంతో విరిగిపోయిన చెట్ల కొమ్మలను తొలగించి, చీపురుతో ఊడుస్తూ ఇందులో కనిపించారు. 'స్వచ్ఛభారత్.. ప్రపంచ పర్యావరణ దినోత్సవం' అంటూ వ్యాఖ్యను జోడించారు. ఆయనతో పాటు లులియా వంతూర్, నటి జాక్వెలిన్ ఫెర్నాండజ్ ఉన్నారు.
సల్మాన్ స్వచ్ఛభారత్.. ఫార్మ్హౌస్ను శుభ్రం చేస్తూ - చెట్ల కొమ్మలను తొలగించిన సల్మాన్ఖాన్
నిసర్గ తుఫానుతో తన వ్యవసాయ క్షేత్రంలో విరిగిపడిన చెట్ల కొమ్మలను తొలిగిస్తున్న ఓ వీడియోను పోస్ట్ చేశారు స్టార్ హీరో సల్మాన్ఖాన్. ఇందులో స్వచ్ఛ భారత్ అంటూ రాసుకొచ్చారు.
సల్మాన్
లాక్డౌన్తో ఫామ్హౌస్లో ఉంటున్న సల్మాన్.. జాక్వెలిన్తో కలిసి రెండు పాటల్లో నటించారు. వాటిని ఇటీవలే అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం ఈయన ప్రభుదేవా దర్శకత్వంలో 'రాధే' సినిమా చేస్తున్నారు. ఇందులో దిశా పటానీ హీరోయిన్. జాకీష్రాఫ్, భరత్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే థియేటర్లలోకి రావాల్సిన ఈ చిత్రం.. కరోనా ప్రభావంతో వాయిదా పడింది.
ఇదీ చూడండి : చీపురు పట్టి అమ్మకు సాయం చేసిన సితార