తెలంగాణ

telangana

By

Published : May 22, 2020, 12:00 PM IST

ETV Bharat / sitara

దీపావళికి ఆ రెండు చిత్రాల మధ్య యుద్ధం తప్పదా?

కరోనా లాక్​డౌన్ కారణంగా థియేటర్లు తెరచుకోవడానికి ఇంకా రెండు మూడు నెలల సమయం పట్టేలా ఉంది. అయితే ఇప్పటికే దీపావళి పండగను లక్ష్యం చేసుకుని చాలా సినిమాలు విడుదలకు ప్రయత్నిస్తున్నాయి. అందులో బాలీవుడ్ స్టార్ హీరోలు సల్మాన్, అక్షయ్​ల చిత్రాలు కూడా ఉన్నాయి.

సల్మాన్
సల్మాన్

ప్రస్తుతం సినిమా థియేటర్లలో ఎటుచూసినా అంతా శూన్యమే కనిపిస్తోంది. కారణం కరోనా వైరస్‌ అని చెప్పవచ్చు. అయితే లాక్‌డౌన్‌ పూర్తికాగానే ప్రభుత్వంతో చర్చలు జరుపుతారట. జులై చివరి వారం నాటికి సినిమా థియేటర్లు తెరుచుకోనున్నాయనే వార్తలు కూడా వస్తున్నాయి. అయితే అక్కడ కూడా సామాజిక దూరంతోనే ప్రేక్షకులు కూర్చోవలసి ఉంటుందని చెప్పుకుంటున్నారు. 500 మంది పట్టే థియేటర్లో కేవలం యాభై శాతం మాత్రమే అనుమతి ఇస్తారనే ఉహాగానాలు వస్తున్నాయి.

అయితే ఇప్పటికే బాలీవుడ్‌ అగ్రహీరోల సినిమాలు తమ విడుదల తేదీలను మార్చుకోగా, మరికొన్ని ఓటీటీల ద్వారా కూడా విడుదల కానున్నాయి. ప్రస్తుతం సల్మాన్‌ ఖాన్‌ నటిస్తున్న 'రాధే: యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్'తో పాటు మరో హీరో అక్షయ్‌ కుమార్‌ పోలీస్‌ అధికారిగా నటిస్తున్న చిత్రం 'సూర్యవంశీ'. అంతా సవ్యంగా జరిగితే ఈపాటికే ఈ చిత్రాలు అభిమానులను అలరించేవి.

అయితే తాజాగా ఈ రెండు చిత్రాలను దీపావళి పండుగ నాటికి నేరుగా థియేటర్లోనే విడుదల చేయడానికి చిత్రనిర్మాణ సంస్థలు ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. అలా అయితే ఈ సినిమాల మధ్య తీవ్రమైన పోటీ ఉంటుందని బాలీవుడ్‌లో గుసగుసలు మొదలయ్యాయి.

ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'రాధే' చిత్రంలో సల్మాన్‌ఖాన్‌ సరసన కథానాయికగా దిశా పటానీ నటిస్తోంది. యాక్షన్‌ చిత్రాల దర్శకుడు రోహిత్‌ శెట్టి దర్శకత్వంలో అక్షయ్‌ కుమార్‌ నటిస్తున్న 'సూర్యవంశీ'లో కత్రినా కైఫ్‌ డాక్టర్‌ అదితి సూర్యవంశీగా కనిపించనుంది.

ABOUT THE AUTHOR

...view details