కరోనా(కొవిడ్-19) దెబ్బకు ప్రపంచదేశాలతో పాటు అన్ని రంగాలు కుదేలవుతున్నాయి. అందులో సినీ రంగం ఒకటి. కరోనా కారణంగా సినిమా విడుదల తేదీలు, చిత్రీకరణలు, వాటికి సంబంధించిన వేడుకలు వాయిదా పడుతున్నాయి. ప్రముఖ హీరోలంతా తమ సినిమాలు వాయిదా వేసుకుంటున్నారు.
అయితే ఈ మహమ్మారికి బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ మాత్రం భయపడనంటున్నాడు. ప్రస్తుతం అతడు 'రాధే' సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్నూ యథావిధిగా కొనసాగిస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్గా దిశా పటానీ నటిస్తోంది. తాను కూడా చిత్రీకరణలో చురుగ్గా పాల్గొంటోంది. కరోనా సోకకుండా ప్రపంచ ఆరోగ్య సంస్థ జారీ చేసిన జాగ్రత్తలను చిత్రబృందం పాటిస్తుండటమే ఈ నిర్ణయానికి కారణంగా తెలుస్తోంది. ఈ నెల చివరి నాటికి సినిమా షూటింగ్ పూర్తిచేయడమే లక్ష్యంగా శరవేగంగా పనులు జరుగుతున్నాయి.